Aarti: పూజ అనంతరం హారతి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఇదే?

సాధారణంగా ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ లేదంటే ఆలయంలో పూజ చేసినప్పుడు కానీ పూజ మొత్తం అయిపోయిన తర్వాత దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. అనగా దేవుడ

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 09:15 PM IST

సాధారణంగా ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ లేదంటే ఆలయంలో పూజ చేసినప్పుడు కానీ పూజ మొత్తం అయిపోయిన తర్వాత దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. అనగా దేవుడిని అలంకరించి, ప్రసాదాలు దేవుడికి నైవేద్యంగా పెట్టి టెంకాయను కొట్టిన తర్వాత ఆఖరిలో కర్పూరంతో దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. అలా చివర్లో హారతి ఇవ్వకపోతేహారతి ఆ పూజ సంపూర్ణం కాదు అని అర్థం. దేవుడికి హార్ది ఇచ్చిన తర్వాత ఆ హారతిని మనం కళ్ళకు అద్దుకుంటాం. పూజ తర్వాత హారతి ఎందుకు ఇస్తారు? దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఆలయంలో అయినా సరే హారతి ఇచ్చేటప్పుడు తప్పకుండా గంటను మోగిస్తూ ఉంటారు. శివుడు వంటి కొన్ని కొన్ని ఆలయాలలో డమరుకం కూడా మోగిస్తూ ఉంటారు.

ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది. అయితే ఇదివరకు రోజుల్లో ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలు ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మ క్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని నమ్మకం. ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు.

ఒకప్పుడు కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది. భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శ ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి. ఇకపోతే హారతి ఇవ్వడం వెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే.. పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించే హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం. ఇందులో కల్తీ ఉండదు. కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంద పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఆ ప్రదేశమంతా కూడా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.