Koti Talambralu: అయోధ్య రాములోరి పెళ్లికి గోటి తలంబ్రాలు.. ఏకంగా అన్ని కేజీలు?

అయోధ్య రాముల వారి పెళ్లికి గోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. వాటిని సమర్పించేందుకు భక్తులు అక్కడికి చేరుకోనున్నారు. కాగా తాజాగా తూర్పు గోదావరి జ

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 10:19 PM IST

అయోధ్య రాముల వారి పెళ్లికి గోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. వాటిని సమర్పించేందుకు భక్తులు అక్కడికి చేరుకోనున్నారు. కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఆధ్యాత్మిక నగరం గోదావరి తీరాన రామచిలకలతో అయోధ్య బాల రాముడికి పెండ్లి శుభలేఖతో పాటుగా గోటితో వలిచిన కోటి తలంబ్రాలు వేడుక వైభవంగా జరిగింది. దాదాపుగా నాలుగు నెలల పాటు వరి పంట పండించిన అనంతరం గోటితో తలంబరాలను సిద్ధం చేశారు. కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు. రాజమండ్రి పుష్కర ఘాట్ లో సీతారామ విగ్రహాల ముందు 200 కేజీల తలంబ్రాలను పోసి శ్రీరామ నామ జపం చేశారు.

జై శ్రీరామ్ శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 13 సంవత్సరాలుగా భద్రాచలం రామయ్యకు, ఏడు సంవత్సరాలుగా ఒంటిమిట్ట రెండు సంవత్సరాలుగా సీతారామచంద్రులకు కోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తూ ప్రతి ఏడాది ఆ రాముల వారి ఆశీస్సులను పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్ వద్ద కోటి తలంబ్రాలకు విశ్వశాంతి హారతిని ఇచ్చారు. కోటి వత్తులకు కూడా సీతారామ అష్టోత్తర శతనామ పూజను చేశారు. అంతేకాదు అయోధ్య రామయ్య కోటి శుభలేఖలు యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి శుభలేఖలు కూడా శాంతి హారతి కార్యక్రమం నిర్వహించారు.

గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామ సర్వేనెంబర్ 16/2 లో వరి చేలల్లో ప్రత్యేకంగా పూజ చేసిన వడ్లను పండించి పంట ఎనిమిది వందల కేజీలను ఐదు రాష్ట్రాలకు 600 మంది భక్తులకు ఇచ్చి పంపిణీ చేశారు. అనంతరం అయోధ్యకు పయనమయ్యారు. అయోధ్య రామయ్యకు కోటి తలంబ్రాలతో పాటు కోటి శుభలేఖల యజ్ఞం చేపట్టి ఈనెల 24వ తేదీన సాయంత్రం అయోధ్య సరయూ నది తీరాన కోటి వత్తుల దీపారాధన చేయనున్నారు. అలాగే 25వ తేదీన రాముడి కళ్యాణంలో గోటితో వలచిన రామభక్తులు. త్వరలోనే ఇప్పటికే అయోధ్యలో ఏర్పాట్లను కూడా చేస్తున్నారు అధికారులు.