Gold Zodiac Signs: శనివారం ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే…మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.!!

నివారం శనీశ్వరునికి ఇష్టమైన రోజు.

  • Written By:
  • Updated On - May 21, 2022 / 10:45 AM IST

శనివారం శనీశ్వరునికి ఇష్టమైన రోజు. ఈ రోజు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ…ఆరాధిస్తుంటారు. శనిదోషం ఉన్నవారు కూడా ఈ రోజు శనీశ్వరున్ని పూజించినట్లయితే పుణ్యం లభిస్తుందని…పురాణాలు చెబుతున్నాయి. ఇవాళ శనివారం. ఈ రోజు ఈ రాశుల వారు పూజలు చేస్తే  అన్ని శుభాలే కలుగుతాయి. ఇవాళ శనీశ్వరునికి పూజ చేస్తే..ఏయే రాశి వారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం.

ఈ రాశుల వారు శనీశ్వరున్ని పూజించాలి.
శనివారం నాడు ప్రతి ఒక్కరూ పూజలు చేయవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక రాశుల వారు పూజలు చేసినట్లయితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభం, మకరం, మీన రాశుల వారికి శని అర్థాష్టానం జరుగుతోంది. కర్కాటకం, వృశ్చిక రాశివారికి శని అనుగ్రహం లభిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఈ ఐదు రాశుల వారు శనివారం నాడు శనిదేవుణ్ని ఆరాధించాలి. ఇలా చేస్తే..శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది.

శని పూజ ఇలా చేస్తే..శనిదేవుడు సంతోషిస్తాడు..
శని దేవుడికి నువ్వుల నూనె అంటే ఇష్టం. శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరున్ని పూజించాలి. సమీపంలో ఉన్న గుడిలో సూర్యాస్తమయం తర్వాత రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే…శనిదేవుడు సంతోషిస్తాడు. ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు శనీశ్వరునితో పాటు హనుమంతుడిని కూడా పూజించాలి. హనుమంతుని భక్తులను శనీదేవుడు ఎప్పుడు కష్టాలు పెట్టడని పురాణాల్లో ఉంది.