Krishna Janmashtami 2025 : భారతదేశం అంతటా ఎంతో వైభవంగా నిర్వహించే పర్వదినాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. వాసుదేవుడు, దేవకుల కుమారుడిగా అవతరించిన భగవాన్ కృష్ణుడు మథురలో జన్మించారు. కాబట్టి మథురను కృష్ణుడి జన్మస్థలంగా భావిస్తారు. అయితే, ఆయన బాల్యపు దివ్య క్రీడలు, గోపికలతో లీలలు బృందావనంలోనే చోటు చేసుకున్నాయి. అందుకే బృందావనాన్ని ఆయన లీలాధామంగా పరిగణిస్తారు. ఈ రెండు పవిత్ర క్షేత్రాల్లో జన్మాష్టమి వేడుకలు అత్యంత విశిష్టంగా జరుగుతాయి. ఈ సంవత్సరం, అంటే 2025లో జన్మాష్టమి పండుగను ఆగస్టు 16న ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేకంగా మథుర మరియు బృందావనంలోని ప్రముఖ బాంకే బిహారీ ఆలయంలో నిర్వహించే వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఆలయంలో కృష్ణాష్టమి రాత్రి 12 గంటలకు నిర్వహించే మంగళ హారతి విశేష ప్రాధాన్యత కలిగినది.
Read Also: Congress Holds Dharna : రేవంత్ పవర్ ఫుల్ స్పీచ్..దద్దరిల్లిన ఢిల్లీ
ఇది సాధారణ హారతి కాదు. సంవత్సరం మొత్తం ఆలయంలో ఈ మంగళ హారతి ఒకే ఒక్కసారే జరుగుతుంది. అది కేవలం కృష్ణాష్టమి రాత్రే. ఇది ఎందుకంటే, శాస్త్రోక్తంగా ప్రకారం రోజువారీగా శయన ఆరతి అనంతరం, కృష్ణుడు నిధివన్లో గోపికలతో రాసలీలల్లో పాల్గొంటారనే నమ్మకం ఉంది. ఒకసారి రాత్రి విశ్రాంతి తీసుకున్న తరువాత ఆయన త్వరగా మేలుకోరని భావన ఉంది. అందుకే సాధారణ రోజుల్లో ఉదయాన్నే హారతి ఇవ్వరు. కానీ కృష్ణాష్టమి రోజు మాత్రం ఆయన అవతరించిన పవిత్ర ఘడియల్లో, రాత్రి 12 గంటలకు ప్రత్యేక మంగళహారతితో భక్తులు కృష్ణుని దర్శనం పొందేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో మహాభిషేకం కూడా ఘనంగా జరుగుతుంది. పంచామృతాలతో శుద్ధి చేసి, శృంగార అలంకారంతో కూడిన కృష్ణుని విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయం అంతా భక్తిరసంలో మునిగిపోతుంది. అనేక మంది భక్తులు దేశం నలుమూలల నుంచి బృందావనానికి తరలివస్తారు. ఈ సందర్భంగా ఆలయం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. ఫుల్లలతో, దీపాలతో, రంగోలీలతో, కృష్ణుడి బాలలీలలను ప్రతిబింబించే శృంగార స్వరూపాలతో బాంకే బిహారీ ఆలయం వెలిగిపోతుంది.
మధ్యాహ్నం నుండే ఆలయం వద్ద భక్తుల సందడి మొదలవుతుంది. ఆలయ అధికారులు భక్తులకు దర్శనాల సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహార ప్రసాదాల పంపిణీ, సంగీత, నృత్య ప్రదర్శనలతో వేడుకలు మరింత ఉత్సాహభరితంగా మారతాయి. ఇక, నిధివన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భక్తుల నమ్మకం ప్రకారం, నిధివన్లో రాత్రివేళలలో రాసలీలలు జరుగుతాయని, అక్కడ రాత్రి ఎవరూ ఉండరని ఆచారం. దీనివల్లే జన్మాష్టమి రోజు కూడా గోపికలతో రాసలీల కార్యక్రమం ఉండదు. అదే కారణంగా కృష్ణుని విశేష దర్శనంగా మంగళ హారతి నిర్వహిస్తారు. ఈ విధంగా, మథురలో జన్మించిన కృష్ణుడు, బృందావనంలో తన బాలలీలలతో భక్తుల మనసులు దోచుకున్నాడు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేళ ఈ రెండు క్షేత్రాలు భక్తిభావంతో నిండిపోతాయి. కానీ బాంకే బిహారీ ఆలయంలో జరిగే రాత్రి 12 గంటల మంగళహారతి మాత్రం అపూర్వమైనదిగా, భక్తుల జీవితంలో మరపురాని అనుభూతిగా నిలుస్తుంది.
Read Also: Bananas : రోజూ ఎన్ని అరటిపండ్లు తినాలి?.. ఎప్పుడు తినాలి? శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?