Site icon HashtagU Telugu

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద కొట్టుకున్న భక్తులు

Devotees Fights

Devotees Fights

వేసవి సెలవులు, వారాంతపు రోజులు కలగలిసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా కిటకిటలాడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో ట్రావెలర్స్ బంగళా నుంచి శిలాతోరణం వరకూ క్యూలైన్లు ఏర్పడ్డాయి. శనివారం ఒక్కరోజే 84,113 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా రద్దీ తీరును అర్థం చేసుకోవచ్చు.

ఈ భారీ రద్దీ మధ్య భక్తులు గంటల తరబడి కంపార్ట్‌మెంట్లలో నిల్చుండాల్సి రావడంతో కొందర్లో అసహనం పెరుగుతోంది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు 15 నుంచి 18 గంటల సమయం పట్టింది. తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన 33,868 మంది భక్తులు కూడా దీర్ఘంగా వేచి ఉండాల్సి వచ్చింది. టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు అందజేస్తూ సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ, నిరీక్షణకు భక్తులు కొంతమంది అసహనంతో వ్యవహరించారు.

Swami Sivananda Saraswati: యోగా గురువు శివానంద సరస్వతి ఇక లేరు.. జీవిత విశేషాలివీ

తాజాగా ఈ అసహనం ఘర్షణకు దారి తీసింది. ఆలయ మహాద్వారం వద్ద కొందరు భక్తులు ఒకరినొకరు తోసుకోవడం ప్రారంభించగా, అది చిన్నపాటి గొడవగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆలయ సిబ్బంది మరియు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భక్తులను శాంతపరిచారు. క్యూలైన్‌ను క్రమబద్ధీకరించి పరిస్థితిని నియంత్రించారు. అయితే ఒక దశలో భక్తులు అధికారుల సూచనల్ని పట్టించుకోకుండా మళ్లీ తోపులాటకు దిగడం కనిపించింది. భక్తుల సహకారం లేకుంటే ఇలాంటి రద్దీ పరిస్థితుల్లో క్రమబద్ధత తీసుకురావడం సవాలుగా మారుతోంది.