మామూలుగా చాలామంది పౌర్ణమి,అమావాస్య సమయంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుని ప్రతికూల శక్తుల రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున తమ పూర్వీకులకు పూజ చేయాలి. దీని వల్ల ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే ఈ రోజున ఇంటిని స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుతాయి. జ్యోతిష్యశాస్త్రంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే భారతదేశంలో జన్మాష్టమి నుంచి దీపావళి వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలను మనం అమావాస్య రోజునే జరుపుకుంటాం.
ఇక ఈ రోజు ప్రతికూల శక్తి పోవాలని చాలా మంది ఎన్నో పద్దతులను కూడా పాటిస్తుంటారు. ఇకపోతే మరి అమావాస్య నాడు ఎలాంటి పనులు చేయవలెను ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. అమావాస్య నాడు చీపురును కొనడం అస్సలు మంచిది కాదట. దీన్ని కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో మీ ఇంట్లో డబ్బుకు కొదవ వస్తుందట. అలాగే ఇంట్లో చెడు ప్రభావం ఉంటుంది. అంతేకాదు మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెబుతున్నారు. అమావాస్య నాడు తులసి లేదా మారెడు ఆకులను అస్సలు తెంపకూడదట. ఒకవేల మీరు దేవుడికి సమర్పించాలనుకుంటే అమావాస్యకు ముందు రోజే కోసి పెట్టుకోవడం మంచిది. అమావాస్య నాడు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.
అసలు దీన్ని ముట్టుకోనేవద్దు. ఈ రోజు మందు తాగడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. అంతేకాదు కుటుంబం కూడా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అమావాస్య రోజు రావి చెట్టు కింద దీపాన్ని వెలిగిస్తే అంతా మంచే జరుగుతుందట. అలాగే దేవతలను, పూర్వీకులను పూజించాలి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. అమావాస్య నాడు ఆహార ధాన్యాలను కొనడం, పెళ్లి వేడుకులను చేసుకోవడం, పూజా సామాగ్రిని కొనడం, మాంసం తినడం అస్సలు మంచిది కాదు. అలాగే ఈ రోజు ఎలాంటి శుభకార్యాల్లో పాల్గొనకూడదు. అంతేకాదు వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద లావాదేవీలను చేయకూడదట. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించకూడదని చెబుతున్నారు. అలాగే అమావాస్య రోజు చనిపోయిన కుటుంబ సభ్యులను పూజించడం మంచిది.
ఇకపోతే అమావాస్య నాడు శ్మశాన వాటికలు వంటి చీకటి, నిర్మానుశ్య ప్రదేశాలకు వెళ్లకూడదట. ఎందుకంటే అమావాస్య రోజున దుష్ట శక్తులు పనిచేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రతి అమావాస్య రోజున మన పూర్వీకులు తమ ఇండ్లకు సందర్శిస్తారట. అందుకే ఈ రోజున దానధర్మాలు చేయాలని చెబుతున్నారు. ప్రతి అమావాస్య నాడు ఆవుకు 5 రకాల పండ్లను, గోధుమ ఉండలను పెట్టాలట. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరిగి ఆదాయం స్థిరంగా ఉంటుందని చెబుతున్నారు.