Covid: ఏపీలో కలకలం.. కోవిడ్ సోకిన మహిళ మృతి

ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు.

Published By: HashtagU Telugu Desk
Symptoms Difference

Symptoms Difference

Covid: ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు. ఓ మహిళ (51) వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇంకా 27 మంది కోవిడ్ చికిత్స పొందుతున్నట్లుగా వైద్యులు తెలిపారు.

కరోనా కేసులు దృష్టిలో ఉంచుకుని మాక్ డ్రిల్స్‌తో పాటు అవసరమైన అన్ని వస్తువులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో పాటు మళ్లీ కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో కూడా తెలుసుకుంటున్నారు. ఇందుకోసం ఇన్‌ఫ్లుఎంజా, శ్వాసకోశ వ్యాధులపై నిఘా వేసి జిల్లా స్థాయిలో నివేదికలను సిద్ధం చేయాలని అధికారులు కోరుతున్నారు.

Also Read: Sircilla: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!

ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 628 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీని తర్వాత కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి పెరిగింది. కరోనా JN.1 కొత్త వేరియంట్ మొదటి కేసు ఆగస్టు నెలలో లక్సెంబర్గ్‌లో నివేదించబడింది. ఇప్పటివరకు భారతదేశంలో కొత్త వేరియంట్ మొత్తం 63 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా 34 కేసులు గోవాలో మాత్రమే కనుగొనబడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 26 Dec 2023, 12:42 PM IST