ఇండియాలో గత 24 గంటల్లోకొత్తగా 1,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 4,100(గతంలో కొన్ని రాష్ట్రాల్లో నమోదు చేయని మరణాలు ప్లస్ నిన్న నమోదైన మరణాలు కలిపి) మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,349 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4,30,18,032 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,20,855 మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే ఇండియాలో ఇప్పటి వరకు 4,24,80,436 కోట్ల మంది కరోనా నుంచి కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 16,741 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.24 శాతం ఉంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో 1,82,87,68,476 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.