Acharya Pre Release : మెగాఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చుపెడుతున్న ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్‌. చిరు నిర్ణ‌యమే కార‌ణ‌మా?

మెగాస్టార్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఆచార్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 23న విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌బోతోంది.

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 04:21 PM IST

మెగాస్టార్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఆచార్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 23న విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే ఈ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య‌నే రిలీజైన ఆచార్య ట్రైల‌ర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించగా.. సినిమా కథ ఆ పాత్ర ద్వారానే అల్లుకున్నట్లు ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది. ఏప్రిల్ 29న ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

జ‌గ‌న్‌ను ముఖ్య అతిధిగా పిల‌వ‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాలు కూడా వెతుకుతున్నారు నెటిజ‌న్స్‌. సినిమాల‌ను, రాజ‌కీయాల‌ను ముడిపెట్ట‌డం మంచిది కాదంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌లు చేస్తున్నారు కొంత‌మంది మెగా ఫ్యాన్స్‌.

 

అయితే, నిజ‌మైన మెగాఫ్యాన్ అయితే మెగాస్టార్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా పాటించాలంటూ మ‌రికొంత‌మంది ట్వీట్లు చేస్తున్నారు. మొత్త‌మ్మీద ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ మెగాఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చుకు కార‌ణ‌మ‌య్యేలా ఉంది.

ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా.. విలన్ పాత్రను సోనూసూద్ పోషించాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య సినిమా నిర్మించగా.. దేవిశ్రీ సంగీత బాణీలు సమకూర్చారు.