Dhanush Aishwarya: ధనుష్-ఐశ్వర్య ‘‘డివోర్స్’’ స్టోరీ.. అసలు రీజన్స్ ఇవేనా?

తమిళ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య విడిపోవడం అభిమానులను షాక్‌కు గురి చేసి ఉండవచ్చు. అయితే ఈ జంట విడిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.

  • Written By:
  • Updated On - January 18, 2022 / 10:23 PM IST

తమిళ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య విడిపోవడం అభిమానులను షాక్‌కు గురి చేసి ఉండవచ్చు. సోషల్ మీడియా పోస్ట్ లో ఈ జంట విడిపోయినట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాన్ని గౌరవించాలని, తమకు ప్రైవసీ ఇవ్వాలని కోరారు. అయితే ఈ జంట విడిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.

విడిపోవడానికి కారణమైన సంఘటన ఏమిటి?

ఈ జంట విడిపోవడంతో దాదాపు పద్దెనిమిదేళ్ల మ్యారేజ్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. ఈ విషయం సన్నిహితులకు షాకింగ్ అనిపించకపోయినా అభిమానులు మాత్రం కంగు తిన్నారని చెప్పక తప్పదు. ఈ విషయమై ధనుష్-ఐశ్వర్ కామన్ ఫ్రెండ్ ఒకరు రియాక్ట్ అయ్యాడు. “ధనుష్ ఒక వర్క్ హోలిక్. ఏదైనా పనిని ప్రారంభిస్తే.. పూర్తయ్యేదాకా వదిలిపెట్టడు. అతనికి కమిట్ మెంట్స్ చాలా ఉంటాయి. సినిమా షూటింగ్స్ కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలను తిరుగుతుంటాడు. అవుట్ డోర్ షూటింగ్స్ కూడా చాలా ఎక్కువే. ఈ కారణం కూడా అతని కుటుంబ జీవితాన్ని దెబ్బతీసింది’’

ఐశ్వర్యతో గొడవ జరిగినా ప్రతిసారి..

ధనుష్, ఐశ్వర్యల మధ్య ఏ విధమైన గొడవ జరిగినా.. ధనుష్ ప్రతిసారీ ఒక కొత్త చిత్రానికి సైన్ చేస్తుంటాడు. బహుశా తనను తాను పనిలో నిమగ్నమై ఉండేలా చూసుకుంటాడు. “ధనుష్ గురించి తెలిసిన ఎవరికైనా.. అతను చాలా ప్రైవేట్ వ్యక్తి. అతని సన్నిహిత మిత్రులతో కూడా.. అతని మనస్సులో ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అతను ఐశ్వర్యతో లేదా ఏదైనా టెన్షన్‌కు గురైనప్పుడల్లా కొత్త సినిమాకు సైన్ చేసి.. అందులో మునిగిపోతాడు. ఇద్దరి మధ్య జరిగే గొడవ నుంచే ధనుష్ అలా చేస్తుండట. బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు.. నిర్మాణ పనులను పర్యవేక్షించడం, OTT వైపు ఫోకస్ చేయడం.. కొత్త ప్రాజెక్టుల గురించి డిస్కస్ చేయడం లాంటివన్నీ.. ఇద్దరికి కష్టంగా అనిపించాయి. గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి కూడా. విడిపోవాలనుకునే నిర్ణయం ఇప్పటిదీ కాదని, చాలా కాలంగా ధనుష్, ఐశ్వర్య మనసులో ఉందని కోలివుడ్ టాక్.

విడాకుల ప్రకటనను ఎలా ప్లాన్ చేశారు?

డివోర్స్ అనౌన్స్ మెంట్ చేయడానికి ముందు కూడా ఈ కపుల్ చాలాసేపు మాట్లాడుకున్నారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ధనుష్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేలోపు అత్రంగి రే సినిమా ప్రమోషన్స్ పూర్తి చేయాలని అనుకున్నాడు. “ఆత్రంగి రే మొత్తం ప్రమోషన్ల సమయంలో ధనుష్ తన ఎలిమెంట్‌లో లేడు. వ్యక్తిగతంగా ఉన్నాడని స్పష్టమైంది. మరోవైపు ఐశ్వర్య ఫిట్‌నెస్, ఇతర రంగాల్లో ఫోకస్ చేస్తోంది. ఆమె చేపట్టే స్వచ్ఛంద సంస్థలు, మహిళా సాధికారత ప్రాజెక్టులపై ఇంట్రెస్ట్ చూపుతోంది. అయితే డివోర్స్ విషయం పిల్లలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ఈ విషయాన్ని పిల్లలకు స్పషంగా చెప్పాలని ఐశ్వర్య రజినీకాంత్ భావిస్తోంది.

పిల్లల ప్రాధాన్యతల గురించి?

కొన్ని సంవత్సరాల ముందు కూడా డివోర్స్ ప్రస్తావన వచ్చిందట. వ్యక్తిగత ఆనందం కోసం ఈ జంట విడిపోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. విడాకుల విషయం పిల్లలపై ప్రభావం చూపకుండా.. భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇద్దరి మధ్య చర్చలు కూడా నడిచాయని సన్నిహితులు అంటున్నారు. కాగా ధనుష్ చాలా ప్రైవేట్ వ్యక్తి అని.. గతంలో హీరోయిన్ త్రిషతో క్లోజ్ గా మూవ్ అయినట్టు.. ఆ విషయమై ఐశ్వర్య సీరియస్ అయినట్టు కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇంకొన్ని రోజులు గడిస్తే కానీ.. అసలు కారణాలు ఏమిటో తెలిసే అవకాశాలున్నాయి.