Pushpa:పుష్పకి మన్యంపులికీ సంబంధం.. అసలు కథేంటీ..?

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న చిత్రం ఇది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ నెల 17న భార అంచనాల మధ్య ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల కాబోతోంది.

  • Written By:
  • Publish Date - December 15, 2021 / 04:05 PM IST

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న చిత్రం ఇది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ నెల 17న భార అంచనాల మధ్య ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా విడుదల కాబోతోంది. మళయాల స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో సునిల్, అనసూయ, ధనుంజయ(కన్నడ యాక్టర్) విలన్ పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హాట్ హాట్ టాపిక్ గా మారింది. విడుదల విషయంలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ట్రైలర్ చూస్తే మరీ గొప్పగా అనిపించకపోయినా.. లేటెస్ట్ గా ఈ మూవీకీ మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మన్యంపులికీ పోలికలున్నాయంటూ ఇంకా చెబితే కథ ఇదే అంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
మన్యంపులిలో మోహన్ లాల్ చిన్నప్పుడే అతని తండ్రిని ఓ పులి చంపేస్తుంది. కుర్రాడిగా ఉన్నప్పుడే ఆ పులిని చంపి పగ తీర్చుకుంటాడు హీరో. తర్వాత పులి వేటగాడుగా ఆ ప్రాంతం అంతా పేరు తెచ్చుకుంటాడు. ఇటు పుష్పలో కూడా ఇంచుమించు ఇలాంటి సెంటిమెంట్ తో కూడిన రివెంజ్ డ్రామానే ఉంటుందంటున్నారు. హీరో చిన్నతనంలోనే అతని తండ్రి విధిలేని పరిస్థితుల్లో ఎర్రచందనం స్మగ్లర్ గా మారతాడు. పోలీస్ ల రైడ్ లో అతను మరణించడం లేదా జైలుకు వెళ్లడమో జరుగుతుంది. ఆ టైమ్ లో పోలీస్ లు ప్రవర్తించిన తీరుకు ప్రతీకారంగానే పుష్ప చిన్నతనుంచీ తండ్రి పనిలో ఎంటర్ అయి.. పోలీస్ లకు దొరకకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతూ సవాల్ విసురుతాడు. ఆ సవాల్ లో భాగంగానే ఫహాద్ పాత్ర వస్తుంది. ఈ ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ లా సెకండ్ పార్ట్ ఉంటుందట. నిజానికి తన తండ్రికి సంబంధించిన ఎపిసోడ్ కూడా సెకండ్ హాఫ్ లోనే రివీల్ చేస్తారనీ.. ఆ రివీలింగ్ పాయింట్ తోనే ఫస్ట్ హాఫ్ ముగుస్తుందంటున్నారు.
మొత్తంగా పుష్ప కూడా ఓ సాధారణ రివెంజ్ డ్రామానే. కాకపోతే దీన్ని సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించి ఉంటాడు అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఇమేజ్ కూడా కలిసి సినిమాను కొత్తగా చూపిస్తాయోమో కానీ.. మరీ కొత్త కథైతే కాదు. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే నేపథ్యం మాత్రమే ఈ తరానికి కొత్తగా అనిపిస్తుంది. మొత్తంగా పుష్పరాజ్ కు మన్యంపులికీ మధ్య కొన్ని పోలీకలున్నాయన్నమాట.