Varun Tej: లావణ్యతో పెళ్లి తర్వాత లైఫ్ లో అలాంటి మార్పులు వచ్చాయి: వరుణ్ తేజ్

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 09:30 AM IST

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ గత ఏడాది నవంబర్ లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి ఇద్దరూ ఏకమయ్యారు. అయితే పెళ్లికి ముందే కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చిన లావణ్య, వరుణ్ తేజ్ లు ఎట్టకేలకు గత ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత చాలా రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉన్న వరుణ్, లావణ్యలు మళ్లీ ప్రొఫెషనల్‌ లైఫ్ లో బిజీ కానున్నారు. త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వరుణ్‌ తేజ్‌.శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్‌ హీరోయిన్ గా నటించింది. వైమానిక దళ వీరుల ధైర్య సాహసాలను, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటోన్న సవాళ్ల నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ ను తెరకెక్కించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని మల్లారెడ్డి వుమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో సందడి చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పెళ్లి తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేంటని స్టార్ యాంకర్‌ సుమ వరుణ్ ని అడిగింది.

దీనికి ఫోన్‌కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కడికెళ్తున్నావనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు వరుణ్ తేజా. అలాగే మరో ప్రశ్నకు ఈ ఏడాది వేలంటైన్స్ డే కు తన భార్య లావణ్య త్రిపాఠి ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వలేదని తెలిపారు. అయితే ఇద్దరూ విహార యాత్రకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.