Virupaksha: అదేంటి విరూపాక్ష సినిమా విడుదల అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీ లోకా?

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా తాజాగా నేడు అనగా

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 07:30 PM IST

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా తాజాగా నేడు అనగా ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ గానే స్పందన లభించింది. అంతేకాకుండా హీరో హీరోయిన్ల నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రేపటి నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి మరి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం ఒక్కరోజు కూడా పూర్తిగా ముందే అప్పుడే ఓటీటీ కి ఎప్పుడు విడుదల అవుతుంది అన్న చర్చలు మొదలయ్యాయి. సినిమా ఎంత బాగున్నా కూడా నెల రోజుల తర్వాత అయినా ఓటీటీ రావాల్సిందే కదా. మరి ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ సంస్థ దక్కించుకోనుంది అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకోనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ఏడాది ఎన్ని సినిమాలు తన ఓటీటీలో విడుదల వస్తాయన్న విషయాన్ని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో విరూపాక్ష సినిమా కూడా ఉంది. టైటిల్ కార్డ్స్ లో నెట్ ఫ్లిక్స్ సంస్థ పేరు వేయడంతో కన్ఫర్మ్ అయింది. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది మాత్రం ఇప్పుడే తెలియదు. అందుకు కాస్త సమయం పట్టేటట్టుగానే కనిపిస్తోంది. ఈ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులు థియేటర్ల బాటపడుతున్నారు.