Site icon HashtagU Telugu

Prasanth Narayanan: దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి

Prasanth Narayanan

Prasanth Narayanan

Prasanth Narayanan: నటుడు, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ (51) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన తిరువనంతపురంలో మరణించారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆయనను జనరల్ ఆస్పత్రిలో చేర్చారు.

మోహన్‌లాల్ నటించిన ఛాయాముఖితో సహా అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. సినీ రంగంలో 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. చిన్న వయస్సు నుండి సినిమాలనే ప్రపంచంగా భావించాడు. 2008లో మోహన్‌లాల్  నటించిన ఛాయాముఖి సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించాడు. సంగీత నాటక అకాడెమీ అవార్డుతో పాటు అనేక అవార్డులను గెలుచుకున్నారు.

మకరధ్వరాజన్, మహాసాగరం మరియు మణికర్ణికతో సహా అనేక హిట్ సినిమాలను నిర్మించారు. ప్రశాంత్ నారాయణన్ వివిధ భాషలలో దర్శకత్వం వచించారు. తిరువనంతపురం వెల్లయని కథాకళి రచయిత వెల్లాయని నారాయణన్ నాయర్ మరియు శాంతకుమారిల కుమారుడే శాంత్ నారాయణన్.

Also Read: Free Scheme : బస్సుల కోసం పడిగాపులు…ఫ్రీ అంటే ఇదేనేమో..!