Made In India : దర్శక దిగ్గజం రాజమౌళి నెక్స్ట్ సినిమా ఏమిటి ? ఎప్పుడొస్తుంది ? అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. మహేష్ బాబుతో మూవీ తీయడానికి ముందు.. మరొక సినిమాను ఆయన రిలీజ్ చేయబోతున్నారు. దానిపేరే ‘మేడ్ ఇన్ ఇండియా’ !! ఈ మూవీ స్టోరీ ఏమిటో తెలుసా ? భారత సినిమా పరిశ్రమ చరిత్ర !! దీనిపైనే రాజమౌళి బయోపిక్ తీయబోతున్నారు. ఇండియా సినిమా ఎలా పుట్టింది ? ఎలా ఎదిగింది ? ఎవరు ఇండియన్ సినిమాని మొదలుపెట్టారు ? అనే కథాంశంతో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉండబోతోంది. రాజమౌళి పర్యవేక్షణలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు SS కార్తికేయ కలిసి ‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీని నిర్మిస్తున్నారు. ఈవివరాలను రాజమౌళి ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
When I first heard the narration, it moved me emotionally like nothing else.
Making a biopic is tough in itself, but conceiving one about the FATHER OF INDIAN CINEMA is even more challenging. Our boys are ready and up for it..:)
With immense pride,
Presenting MADE IN INDIA… pic.twitter.com/nsd0F7nHAJ— rajamouli ss (@ssrajamouli) September 19, 2023
‘‘బయోపిక్స్ తీయడం చాలా కష్టం. ఇక ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ తీయాలంటే మరింత కష్టం. ఈ సినిమాని నాకు నేరేషన్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. అందుకే చాలా గర్వంతో ఈ మేడ్ ఇన్ ఇండియా సినిమాను ప్రజెంట్ చేస్తున్నాను’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ మూవీ (Made In India) పాన్ ఇండియా స్థాయిలో 6 భాషల్లో రూపొందనుంది. ఇంతకుముందు యమదొంగ సినిమాను తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన రాజమౌళి… ఆ తర్వాత మళ్లీ ప్రొడక్షన్ వైపు వెళ్లలేదు. ఇటీవలే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాను పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.