Site icon HashtagU Telugu

Guntur Kaaram: మహేశ్ బాబుకు షాక్.. గుంటూరు కారం నుంచి పూజాహెగ్డే, థమన్ ఔట్!

Ssmb28

Ssmb28

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తొలినుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్న మూవీకి తాజాగా హీరోయిన్ పూజాహెగ్డే  రూపంలో మరో షాక్ తగిలింది. “గుంటూరు కారం” షూటింగ్ షెడ్యూల్‌లో అనేక మార్పులతో పాటు ఆలస్యం జరిగింది, ఫలితంగా రీషూట్‌లు, స్క్రిప్ట్ సవరణలు జరిగాయి. ఇవన్నీ పూజకు కోపం తెప్పించాయట. దీంతో ఆమె మహేష్ బాబు సినిమాకు నో చెప్పడానికి కారణమైంది.

రిపోర్ట్స్ ప్రకారం.. పూజ జూన్, డిసెంబర్ మధ్య ఇతర సినిమాలు చేయాల్సి ఉంది. గుంటూరు ఆలస్యం కావడంతో ఇతర కమిట్‌మెంట్స్ ఉండటం పూజ నిరాశకు గురైంది.  దర్శక నిర్మాతలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మూవీ నుంచి తప్పుకుంది. ఇక పూజా నిష్క్రమణతో మ్యూజిక్ డైరెక్షన్ లో నూ  మార్పులు చేయాల్సి వచ్చింది.

ఈ మూవీకి (Guntur Kaaram) మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పనిచేస్తున్నారు. ఆయన మ్యూజిక్ పట్ల టీం అసంతృప్తిగా ఉండటంతో అతను తప్పుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడానికి అనిరుధ్ రవిచందర్‌ను బోర్డులోకి తీసుకురావాలని భావిస్తున్నారట. పూజా హెగ్డే, థమన్ తప్పుకోవడంతో పాటు గుంటూరు కారం సినిమా విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఇటు హీరోయిన్, అటు మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకోవడంతో మహేశ్ అభిమానులు తీవ్రంగా నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Heat Wave: వడదెబ్బ తగలకుండా సేఫ్‌గా ఉండడం ఎలా?