Pushpa : సమంత.. పుష్పరాజ్ తో స్టెప్పులకు రెడీ!

టాలీవుడ్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత వ్యక్తిగతంగా చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. ఈమె బద్రీనాథ్, కేదార్‌నాథ్, గోవా పర్యటనలు చేసి రీఫ్రెష్ అయ్యింది.

  • Written By:
  • Updated On - November 17, 2021 / 01:01 PM IST

టాలీవుడ్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత వ్యక్తిగతంగా చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. ఈమె బద్రీనాథ్, కేదార్‌నాథ్, గోవా పర్యటనలు చేసి రీఫ్రెష్ అయ్యింది. అయితే ఇప్పుడు సమంత నటనపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. గత కొన్ని రోజులుగా పుష్ప మేకర్స్ ప్రత్యేక పాట కోసం సమంతతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. సమంత కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. నవంబర్ 25 నుంచి నవంబర్ 30 మధ్య హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్‌లో పాటల చిత్రీకరణ జరగనుంది. ఈ పాటతో పుష్ప షూటింగ్ పూర్తవుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశకు చేరుకుంటుంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాలను చూపించనుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం, పుష్ప: ది రైజ్, డిసెంబర్ 17 న బహుళ భాషలలో థియేటర్లలో విడుదల కానుంది. పుష్పలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ధనంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, హరీష్ ఉత్తమన్ ఈ చిత్రంలో సహాయక పాత్రలు పోషించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.