చైతూ,స‌మంత విడాకుల క‌థ‌.. తిరుమ‌లద‌ర్శ‌నంలో స‌మంత

  • Written By:
  • Publish Date - September 18, 2021 / 04:11 PM IST

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి సాధార‌ణంగా భార్యాభ‌ర్త‌లు వ‌స్తుంటారు. దంప‌తులు క‌లిసి ద‌ర్శ‌నం చేసుకోవ‌డం చాలా మంచిద‌ని పండితులు చెబుతుంటారు. అక్కినేని చైత‌న్య లేకుండా స‌మంత ఒక్క‌రే ద‌ర్శ‌నం చేసుకోవ‌డం తాజాగా టాలీవుడ్ లో పెద్ద టాక్. ఇటీవ‌ల వాళ్లిద్ద‌రికి బ్రేక‌ప్ అయింద‌ని వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చైత‌న్య చేశాడు. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ తిరుమ‌ల ద‌ర్శ‌నంలో స‌మంత ఒక్క‌టే క‌నిపించ‌డంతో బ్రేక‌ప్ వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పైగా ఆమె తిరుమ‌ల ద‌ర్శ‌నానికి సంబంధించిన ఫోటోల‌ను ఇన్ స్ట్రాలో పోస్ట్ చేశారు. ఇటీవ‌ల త‌న ఫ్రెండ్ శిల్పారెడ్డితో క‌లిసి గోవా వెళ్లిన ఫోటోలు, తిరుమ‌ల ద‌ర్శ‌నం ఫోటోలు ఇన్ స్ట్రాలో పోస్ట్ చేయ‌డంతో చైతూ, స‌మంత బ్రేక‌ప్ న్యూస్ మ‌ళ్లీ వేగ‌వంతం అయింది.

అక్కినేని స‌మంత అంటూ గ‌తంలో సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై పేరు ఉండేది. ఇటీవ‌ల ఆ పేరును తొల‌గించి ఎస్ అంటూ స‌మంత రాసుకుంది. అది గ‌మ‌నించిన అభిమానులు ఇక ఇద్ద‌రి మ‌ధ్యా బ్రేక‌ప్ ఖాయ‌మ‌ని భావించారు. అది నిజం కాద‌ని ట్వీట్ చేయ‌డంతో టాలీవుడ్ లో తాత్కాలికంగా గాసిప్ నిలిచిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు తిరుమ‌ల ద‌ర్శ‌నం త‌రువాత తెర‌మీద‌కు వ‌చ్చింది. దాదాపు నెల రోజులుగా షూటింగ్ ల‌కు దూరంగా ఉన్న స‌మంత ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూ తిరుగుతోంది. ఆ క్ర‌మంలోనే తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్లింది.
గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న సినిమా శ‌కుంత‌ల‌. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకే, స‌మంత తిరుమ‌ల‌కు శ‌‌కుంత‌ల సినిమా యూనిట్ తో ద‌ర్శ‌నానికి వెళ్లింద‌ని చెబుతున్నారు. ఆమె వెంట ఏం మాయ‌చేశావే హీరోయిన్ కూడా ఉంది. సో..గోవా టూర్ కు ఫ్రెండ్ శిల్పారెడ్డితోనూ ఇప్పుడు తిరుమ‌ల‌కు మ‌రో హీరోయిన్ తో క‌లిసి స‌మంత క‌నిపించింది. ఇంకేముంది, చైత‌న్య‌తో బ్రేక్ కావ‌డంతో ఇలా స‌మంత యాత్ర‌ల‌కు తిరుగుతోంద‌న్న టాక్ వినిపిస్తోంది.
అక్కినేని చైత‌న్య ట్వీట్ల‌ను గ‌మ‌నిస్తే, స‌మంత దూరంగా ఉంటున్నాడ‌ని అర్థం అవుతోంది. లైవ్ స్టోరీ ప్రెస్ మీట్ పెట్ట‌డానికి కూడా సాహ‌సించ‌లేక‌పోతున్నాడ‌ట‌. మీడియాకు కండీష‌న్స్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ కండిష‌న్ ఏంటో తెలుసా..స‌మంత గురించి ఎవ‌రూ ప్ర‌శ్నించ‌నంటే మీడియా ముందుకు వ‌స్తాన‌ని చెబుతున్నాడ‌ట‌. ఇలాంటి కండిష‌న్ల‌ను వింటోన్న సినీ విలేక‌రులు ఇక స‌మంత‌, చైత‌న్య విడాకులు తీసుకోవ‌డ‌మే మిగిలింద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. సో…వాళ్ల‌ద్ద‌రి బ్రేక‌ప్ గాసిప్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయ‌న్న‌మాట‌.