Sai Pallavi : సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు తీసుకుంటుందా..!

బాలీవుడ్ రామాయణంలో సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు పారితోషకం తీసుకుంటుందా..?

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 11:42 AM IST

Sai Pallavi : ఆదిపురుష్ తరువాత బాలీవుడ్ లో మరో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రామాయణాన్ని దంగల్ ఫేమ్ నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుంటే సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతమ్మగా కనిపించబోతున్నారు. కన్నడ స్టార్ హీరో యశ్ రావణుడిగా నటించనున్నారు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ కూడా మొదలయింది. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

దాదాపు 1000 కోట్లా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు సమాచారం. ఈ మూడు భాగాల్లో నటించేందుకు మెయిన్ స్టార్ కాస్ట్ రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇన్నాళ్లు పాత్రని బట్టి, సినిమా బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చిన సాయి పల్లవి.. ఈ భారీ బడ్జెట్ సినిమాకి భారీ పారితోషకమే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మూడు భాగాల్లో నటించేందుకు సాయి పల్లవి సుమారు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

సాయి పల్లవి కెరీర్ లోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. అయితే అసలు ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో ఈ ముగ్గురు స్టార్స్ తో పాటు మరికొన్ని ముఖ్య పాత్రల్లో మరికొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. మొదటి భాగం 2025 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుందట. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Also read : Sandeep Reddy Vanga : ప్రభాస్, విజయ్, రణ్‌బీర్, షాహిద్‌తో.. సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తానంటున్న వంగ..