దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం జపాన్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కథానాయకులు ఎన్టీఆర్, రామ్చరణ్ అక్కడ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈ పోస్టర్ను విడుదల చేశారు. చరణ్ ఉపాసనతో కలిసి, ఎన్టీఆర్ ప్రణతి, పిల్లలతో కలిసి ఫ్యామిలీలతో జపాన్ బయలుదేరారు. ఎయిర్ పోర్ట్ లో అభిమానులు వీరి ఫోటోలు తీయగా అవి వైరల్ గా మారాయి. అమెరికాలో ఉన్న రాజమౌళి అక్కడ్నుంచి డైరెక్ట్ గా జపాన్ వెళ్లారు. జపాన్ లో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించడానికి రెడీగా ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా జపాన్ ప్రేక్షకులతో చరణ్, ఎన్టీఆర్ సందడి చేశారు.
అక్కడ తాము ఎంజాయ్ చేస్తున్న చిత్రాలను ఉపాసన తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రాలు నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ చరణ్ అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు.జపాన్ లో దొరికే వివిధ రకాల తినుబండారాలు, సీడీలు, కూల్ డ్రింక్ సీసాలపై చరణ్ ముఖాన్ని చిత్రీకరించి విక్రయిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుతూ కొందరు లేఖ రాశారు. దాన్ని ఓ మహిళా అభిమాని ఎన్టీఆర్కు అందజేయగా… దానికి ఆయన ఫిదా అయ్యారు.
ఇక ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా టీవీ ప్రేక్షకులను, అభిమానులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీఆర్పీ తాజాగా విడుదల అయ్యింది. ఈ చిత్రం స్టార్ మాలో ప్రసారం అవ్వగా, దీనికి 19.6 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది… అయితే ఈ సినిమాకు రావాల్సిన రేటింగ్ ఇది కాదని.. అంటున్నారు ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్.
#RRR の #naatunaatu ダンスを横浜ディワリでも踊りました!
超楽しくて、今でも興奮が抜けない。
最高のステージでした!今回7分のダンスパフォーマンスを、構成・指揮してくれた、 @kaketaku85 さんに、大感謝!
踊るのって、こんな気持ちいんだな!しばらく忘れてたぜ! pic.twitter.com/y7L95M87K2
— まよ🇮🇳日印つなぐインフルエンサー (@MayoLoveIndia) October 16, 2022