నటి సమంత, నాగ్ చైతన్య జంట విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. పెళ్లయిన నాలుగేళ్లకే సమంత, నాగ్ చైతన్య విడిపోయారు. ఆ తర్వాత సమంత తన కెరీర్, ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. మరోవైపు, నాగ్ చైతన్య నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే మరోసారి సమంత, నాగ్ చైతన్య గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం సమంతా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’.
నాగ్ చైతన్య రీసెంట్ గా ఓ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యాడు. ఈ స్క్రీనింగ్కు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర నటీనటులు కూడా హాజరయ్యారు. నాగ్ చైతన్య ఇంటర్వెల్ వరకు సినిమా పార్ట్ చూశాడు. అయితే ఇంటర్వెల్లో సమంత నటించిన ‘ఖషి’ ట్రైలర్ను ప్రదర్శించినప్పుడు.. చైతూ థియేటర్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. మరో హీరోతో తన మాజీ భార్య రొమాంటిక్ సీన్స్ చూడలేక నాగ్ చైతన్య థియేటర్ నుంచి వెళ్లిపోయాడని చర్చ జరుగుతోంది.
సమంతకు ‘ఖుషి’ సినిమా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ తర్వాత ఆమె కెరీర్కి కొంత బ్రేక్ పడింది. గతేడాది ఆమెకు మైయోసైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో చికిత్స, ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఇందుకోసం ఆమె రాబోయే సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందని అర్థమవుతోంది. యశోద లాంటి సినిమాలు సమంతకు మంచి పేరు తీసుకొచ్చినప్పటికీ, కమర్శియల్ గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఖుషి హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది.
Also Read: Blind Cricket: క్రికెట్ లో సత్తా చాటుతున్న ఏపీ అంధ బాలిక.. ఆస్ట్రేలియాను ఒడించి, టైటిల్ గెలిచి!