Guntur Kaaram: శ్రీ లీలా మహేష్ డాన్స్ కి ఫిదా అయిన స్టార్ క్రికెటర్.. పోస్ట్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 02:05 PM IST

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కాగా మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన గుంటూరు కారం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఇందులోని కుర్చీని మడత పెట్టి సాంగ్ మాత్రం అభిమానులను ఒక ఊపు ఊపేసింది.

గతంలో ఎన్నడూ లేనంతగా ఎనర్జీతో మహేశ్ ఈ పాటకు స్టెప్పులేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. అంతేకాకుండా ఈ పాట యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగానే శ్రీల డాన్స్ అదరగొడుతుంది. కానీ ఈ పాటలో ఇరగదీసింది అని చెప్పాలి. మహేశ్ బాబు అన్నట్లే లేడీ ప్రభుదేవాలా తన డ్యాన్స్ తో అదరగొట్టిందీ ముద్దుగుమ్మ. యూట్యూబ్‌ లోనూ కుర్చీ మడత పెట్టి సాంగ్ కు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలోనూ ఈ సూపర్ పాటకు రీల్స్, రీక్రియేషన్లు వస్తూనే ఉన్నాయి.

 

తాజాగా గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవి చంద్రన్ అశ్విన్. సినిమాలో మహేశ్, శ్రీలీల హుషారెత్తించే స్టెప్పులకు తాను ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు స్పిన్ లెజెండ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఒక అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్ ను ప్రస్తావించాడు అశ్విన్. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్‌లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్‌ భయంకరంగా ఉంది. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్‌ టైప్‌ చూడండి. మహేశ్‌ బాబు ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్సర్‌. ఇక శ్రీలీల అదరగొట్టింది. కుర్చీ మడత పెట్టి సాంగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు మంచి ఊపు తీసుకొస్తుంది అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.