Pushpa 2: ‘పుష్ప పార్ట్-2’ లో శ్రీవల్లి చనిపోతుందా?

  • Written By:
  • Updated On - June 21, 2022 / 06:08 PM IST

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప, ది రైజ్ గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ పాన్-ఇండియన్ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ షూటింగ్ వచ్చే నెల జూలైలో ప్రారంభమవుతుంది. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఇప్పటికే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతుం పుష్ప-2కు సంబంధించిన ఓ ఆప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీక్వెల్ లో శ్రీవల్లి పాత్రను చంపే అవకాశం ఉంది. అయితే RRR, KGF 2 అద్భుతమైన విజయం తర్వాత డైరెక్ట్ సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ టాక్.

ఈ ప్రకటన రష్మిక అభిమానులను నిరుత్సాహపరిచింది. పుష్ప పార్ట్- పుష్పరాజ్, శ్రీవల్లీ లవ్ ట్రాక్ ఎంతోమందిని ఆకట్టుకుంది. వాళ్ల ప్రేమాయణం ప్రతిఒక్కరినీ కదిలిస్తుంది కూడా. వీళ్లిదరి లవ్ స్టోరీ సినిమాకు హైలైట్ అని చెప్పక తప్పదు. స్వీకెల్ లో శ్రీవల్లి పాత్ర పెద్దగా ఉండకవపోడంతో అభిమానులు నిరాశ కు గురవుతున్నారు. అయితే.. పుష్ప-ది రైజ్ 2 సీక్వెల్ పార్ట్‌లో టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాసిల్ మాత్రం పూర్తి స్థాయి పాత్రను పోషిస్తాడు.