Raashi Khanna : సౌత్ సినీ ఇండ‌స్ట్రీ పై.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాశీ ఖ‌న్నా..!

  • Written By:
  • Updated On - March 24, 2022 / 10:22 AM IST

ద‌క్షిణాది చిత్ర పరిశ్ర‌మ‌పై తాజాగా రాశీ ఖ‌న్న చేసిన వ్యాఖ్య‌లు సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. 2013లో బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చి రాశీ ఖ‌న్నా, ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో అవ‌కాశాలు రాలేదు. మ‌ద్రాస్ కేఫ్ చిత్రంలో రాశీ ఖ‌న్నా పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో, ఆ సినిమా వ‌ల్ల రాశీకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే ఆ త‌ర్వాత ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీకి తెలుగులో మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి.

ఊహ‌లు గుస‌గుస‌లేడే మూవీ హిట్ కావ‌డంతో రాశీకి వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే అప్ప‌ట్లో రాశీ కాస్త బొద్దుగా ఉండ‌డం ఆమెకు మైన‌స్ అయ్యింది. దీంతో రాశీ న‌టించిన కొన్ని తెలుగు సినిమాలు మంచి విజ‌యాలే సాధించినా ఆమె బాడీ పై కామెంట్స్ వ‌చ్చేవి. ఈ క్ర‌మంలో తాజాగా త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న విమ‌ర్శ‌ల‌పై రాశీ స్పందించింది. తనను దక్షిణాధి సినీ పరిశ్రమలో గ్యాస్ ట్యాంకర్ అని హేళన చేశారని రాశీ ఖ‌న్నా ఆవేదన వ్యక్తం చేసింది.

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిరోజుల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో న‌టించే అవకాశం లభించిందని రాశీ చెప్పింది. అయితే అదే స‌మ‌యంలో త‌న శ‌రీర ఆకృతిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని, కాస్త బొద్దుగా ఉండ‌డం వ‌ల్ల‌, సౌత్ సినీ ఇండస్ట్రీ వాళ్ళు త‌న‌ని గ్యాస్ ట్యాంకర్ అని ఎగతాళి చేసేవారని రాశీ తెలిపింది. దీంతో అప్పటి నుంచి తాను సన్నగా మారాలని నిర్ణయించుకున్నాన‌ని రాశీ తెలిపింది. ఈ క్ర‌మంలో త‌న బాడీని త‌గ్గించుకుని క‌రెక్ట్ షేప్‌లోకి తీసుకొచ్చేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, చివ‌రికి అనుకున్నది సాధించాన‌ని రాశీ ఖ‌న్నా తెలిపింది.

ఇక ఇటీవ‌ల సన్న‌గా, హాట్‌గా మారిన రాశీ తెలుగు, త‌మిళ్, హిందీ మూవీస్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ త‌ర్వాత మ‌రే సినిమా విడుద‌ల కాలేదు. ప్ర‌స్తుతం గోపీ చంద్, మారుతీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్, నాగ చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న థ్యాంక్యూ చిత్రాల్లో న‌టిస్తుంది రాశీ. ఇక కోలీవుడ్‌లో పీఎస్ మిత్ర‌న్, కార్తి కాంబోలో తెర‌కెక్కుత‌న్న స‌ర్ధార్, ద‌నుష్, మిత్ర‌న్ కాంబోలో తెర‌కెక్కుతున్న తిరుచిత్రంబలం, సిద్ధార్థ్ స‌ర‌స‌న మ‌రో చిత్రంలో న‌టిస్తుంది.

ఇక ఇటీవ‌ల బాలీవుడ్‌లో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న రాశీ, క‌ర‌ణ జోహ‌ర్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్‌లో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా ప‌టాని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న యోధా చిత్రంతో సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఇటీవ‌ల అజ‌య్ దేవ‌గ‌న్ నుండి వ‌చ్చిన వెబ్ సిరీస్ రుద్రాలో రాశీ ఖ‌న్నా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ క్రియేట‌ర్స్ రాజ్- డీకే ప్ర‌స్తుతం అమెజాన్ కోసం మ‌రో వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌లో షాహిద్ క‌పూర్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తుంది. దీంతో ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బిజీ అవుతున్న రాశీ, ఓ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సౌత్ ఇండ‌స్ట్రీ పై కామెంట్స్ చేసింది. దీంతో రాశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.