హిందీ జాతీయ భాష కాదంటూ కిచ్చా సుదీప్ రెండ్రోజుల క్రితం చేసిన ప్రకటన అజయ్ దేవగణ్కి మింగుడు పడలేదు. దీంతో ఈ బాలివుడ్ మాచో మ్యాన్ కిచ్చా సుదీప్కి హిందీ జాతీయ భాష’ అంటూ చేసిన ట్వీట్ భారీగా ట్రోలింగ్కు గురైంది, అయితే పలువురు సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అయితే ఈ గొడవలోకి తాజాగా దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా వేలు పెట్టేశాడు. తాజాగా ఆయన్ ట్వీట్ చేస్తూ, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ నటులు తమ చిత్రాలను కన్నడ. తెలుగులో డబ్ చేయడం ద్వారా యష్, ప్రభాస్, అల్లు అర్జున్ మరియు ఇతరులకు సవాలు చేయాలంటూ వర్మ అభిప్రాయపడ్డారు. వారు ఆ సవాలును తీసుకుంటారా అంటూ ఎద్దేవా చేశారు.
అంతటితో వర్మ వదలలేదు. ఓ పై మెట్టు ఎక్కేశారు. సౌత్ స్టార్స్పై బాలివుడ్ స్టార్స్ అసూయ పెంచుకుంటున్నారంటూ ఆర్జీవీ అభిప్రాయానికి వచ్చేశారు. అంతేకాదు సౌత్ చిత్రాలు రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్నాయని, అందుకే ఉత్తరాది నటులు అసూయతో ఉన్నారని ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయని, ఆర్ఆర్ఆర్ రూ. 1000 కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ సృష్టించిందని, అందుకే ఉత్తరాది నటులు అసూయ పెంచుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో రిలీజ్ కాబోయే, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ లాంటి హీరోల సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లు ఎలా ఉంటాయో చూద్దామని ట్విట్టర్లో సవాల్ చేశారు.