Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నయా షెడ్యూల్ స్టార్ట్.. భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్న డైరక్టర్ శంకర్..!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ న్యూ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ మూవీకి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేటి నుంచి ఈ మూవీలోని భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా డైరక్టర్ శంకర్ వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 09:03 AM IST

Game Changer: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ న్యూ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ మూవీకి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేటి నుంచి ఈ మూవీలోని భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా డైరక్టర్ శంకర్ వెల్లడించారు. ఈ మూవీలో చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ నటిస్తోంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అగ్ర హీరో రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలైంది. ఇందులో కేజీఎఫ్‌ ఫైట్‌ మాస్టర్‌ అన్బు అరివు నేతృత్వంలో భారీ యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరించబోతున్నారని, సినిమాకు ఇవి హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు.

Also Read: Power War : అరెస్ట్ కు సిద్ధం? ప‌వ‌న్ ను పిచ్చోడ్ని చేసిన రోజా!

దాదాపు పది రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. తమన్‌ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

మరోవైపు గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్ట‌ర్‌గా శైలేష్ కొల‌ను వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. శంక‌ర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ర‌ఘుబాబు, రాకెట్ రాఘ‌వ‌తో పాటు మ‌రికొంత మంది న‌టీన‌టుల‌పై వ‌చ్చే కామెడీ సీన్స్‌ను శైలేష్ కొల‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిసింది. తొంద‌ర‌గా షూటింగ్‌ను కంప్లీట్ చేయ‌డానికే శైలేష్ కొల‌నుకు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించాల‌ని శంక‌ర్‌, నిర్మాత దిల్‌రాజు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.