Ram Charan : రచ్చ సినిమా షూటింగ్‌లో.. రామ్‌చరణ్‌కి రైలు యాక్సిడెంట్..

రచ్చ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌కి రైలు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న చరణ్ పైకి ట్రైన్ దూసుకు వచ్చింది.

  • Written By:
  • Updated On - April 5, 2024 / 05:34 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు సినిమా ‘మగధీర’తోనే ఇండస్ట్రీ హిట్టు అందుకొని కొత్త రికార్డులు సృష్టించారు. ఆ తరువాత చరణ్ చేయబోయే సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులంతా పవర్ ప్యాకెడ్ మూవీని ఆశిస్తే.. చరణ్ ‘ఆరెంజ్’ వంటి కంప్లీట్ లవ్ స్టోరీతో వచ్చారు. దీంతో ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ డిజాస్టర్ నుంచి బయటపడడం కోసం చరణ్ చాలా గ్యాప్ తీసుకోని చేసిన సినిమా ‘రచ్చ’. ఈ మూవీ రిలీజయ్యి నేటితో 12 ఏళ్ళు అవుతుంది.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2012 ఏప్రిల్ 5న రిలీజయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో హిట్ కొట్టడం కోసం చాలానే రిస్క్ లు చేసారు. ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్‌కి రైలు ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సీన్ లో రామ్ చరణ్ ఒక పోటీకి దిగుతారు. ఆ పోటీ ఏంటంటే.. పట్టాలు పై వస్తున్న రైలుకి ఎదురుగా కారు నడుపుతూ వెళ్ళాలి.

గోవాలో ఆ పోటీకి సంబంధించిన సీన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలోనే అనుకోని ప్రమాదం జరిగింది. ఆ సీన్ ని షూట్ చేస్తున్న సమయంలో చరణ్ పట్టాల పై ఉన్న కారులో కూర్చొని ఉన్నారు. ఇక పట్టాలు పై వస్తున్న ట్రైన్ కారు దగ్గరికి వచ్చేపాటికీ.. దానిని ఆపడం కోసం కేబుల్స్ ఫిక్స్ చేసారు. అయితే ఆ కేబుల్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ట్రైన్ కారు మీదకి దూసుకు వచ్చింది. అది గమనించిన రామ్ చరణ్ కారులో నుండి వెంటనే బయటకి దూకేశారు.

ఆ ప్రమాదంలో రామ్ చరణ్ చేతికి, కాలుకి గాయాలు అయ్యాయి. ఆ ప్రమాద సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారట. ఇక ఆ షెడ్యూల్ పూర్తి కాగానే.. చరణ్ శబరిమల వెళ్లి అయ్యప్పని దర్శించుకొని దీక్షని విరమించారట. ఇక ఆ ప్రమాదంలో జరిగిన గాయాల నుంచి కోలుకోవడం కోసం చరణ్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఈ వార్త నేషనల్ వైడ్ సెన్సేషన్ అయ్యింది.

Also read :Venkatesh : వెంకటేష్ కూతురి రిసెప్షన్‌లో.. ఎన్ని రకాల భోజనాలు పెట్టారో చూశారా..!