Rakul Preet Singh: పెళ్లి తర్వాత భర్తతో కలిసి మొదటిసారి డాన్స్ చేసిన రకుల్.. నెట్టింట వీడియో వైరల్?

  • Written By:
  • Updated On - March 5, 2024 / 03:17 PM IST

బాలీవుడ్ ప్రేమ జంట జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.
దాదాపు మూడేళ్ళుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఏడు అడుగులు వేశారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రకుల్ సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.

తాజాగా ఈ నవ దంపతులు చేసిన ఒక డాన్స్ రీల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి తరువాత భర్తతో కలిసి తొలిసారి ఇన్‌స్టా డాన్స్ రీల్ చేశారు రకుల్ ప్రీత్. అయితే ఈ డాన్స్ రీల్ ఒక ఛాలెంజ్ లో భాగంగా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా బడే మియా ఛోటే మియా ఈ మూవీ నుంచి ఇటీవల మస్త్ మలంగ్ ఝుమ్అనే పాటని రిలీజ్ చేశారు. ఆ పాటని ఇన్‌స్టా రీల్ తో టైగర్ ష్రాఫ్ రీ క్రియేట్ చేసి.. బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, రకుల్, జాకీ భగ్నానీ అండ్ తన ఫ్యాన్స్ కి ఛాలెంజ్ ఇచ్చారు.

 

ఆ పాటలోని స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ రీల్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక టైగర్ ఇచ్చిన ఛాలెంజ్ ని అంగీకరిస్తూ రకుల్ అండ్ జాకీ కలిసి ఆ డాన్స్ వీడియో చేశారు. కొత్త జంట కొత్త పాటకి స్టెప్పులు వేస్తుంటే నెటిజెన్స్ ఫిదా అయ్యిపోయారు. ఆ వీడియో పై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్, నైస్, డాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.