Rakul Preet Singh Wedding: రకుల్‌ప్రీత్-జాకీ భగ్నానీల వివాహ వేదిక మార్పు.. ప్ర‌ధాని మోదీ కార‌ణ‌మా..?

బాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి (Rakul Preet Singh Wedding)పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోనుంది.

Published By: HashtagU Telugu Desk
Rakul Preet Singh Wedding

Rakul Wedding

Rakul Preet Singh Wedding: బాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి (Rakul Preet Singh Wedding)పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోనుంది. వీరిద్దరూ తొలుత‌ విదేశీ లొకేషన్‌లో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అయితే గత నెలలో ప్రధాని మోడీ చేసిన విజ్ఞప్తి తరువాత ఈ జంట ఇప్పుడు తమ ప్రణాళికలను మార్చుకున్నారు. వారిద్దరూ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ను చేసుకోబోతున్నారు.

ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు వివాహ వేదిక మార్చుకున్నారు

గత ఏడాది డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ధనవంతులను విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు చేసుకోకుండా దేశంలోనే పెళ్లి చేసుకోవాలని విజ్ఞప్తి చేసి కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ విజ్ఞప్తితో రకుల్, జాకీలు తమ వివాహ ప్రదేశాన్ని మార్చుకున్నారు. పెళ్లి ప్రదేశాన్ని మార్చడానికి గల కారణం గురించి రకుల్ జంట‌ నుండి అధికారిక ధృవీకరణ కూడా లభించింది.

సినీ నిర్మాత, నటుడు జాకీ భగ్నానిని రకుల్ పెళ్లాడబోతోంది. ఇప్పుడు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చివరి క్షణంలో లొకేషన్ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం మరెవరో కాదు దేశ ప్రధాని అని అంటున్నారు. రకుల్ ప్రీత్- జాకీ భగ్నాని గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలలో జాకీ, రకుల్‌ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఈ జంట గత 6 నెలలుగా తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో రకుల్- జాకీ కూడా తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను మిడిల్ ఈస్ట్‌లో నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు.

Also Read: Nani : నాని వేణు ఎల్లమ్మ కథ ఎలా ఉండబోతుంది..?

అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు అందులో మార్పు వచ్చి ఇప్పుడు ఈ పెళ్లి ఇండియాలోని గోవాలో జరగనుంది. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి తర్వాత ఈ జంట పెళ్లి ప్రదేశాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. దేశంలోని సంపన్న వర్గాలకు తమ కుటుంబాలకు సంబంధించిన గొప్ప కార్యక్రమాలను దేశం వెలుపల కాకుండా దేశంలోనే నిర్వహించాలని ప్రధాని మోదీ ఇటీవల విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి పరిస్థితిలో దేశ ప్రధాని ఈ విజ్ఞప్తికి రకుల్ ప్రీత్- జాకీ భగ్నానీ ప్రభావితమయ్యారని, వారు తమ డెస్టినేషన్ వెడ్డింగ్ లొకేషన్‌ను మార్చుకున్నారని స‌న్నిహితులు చెబుతున్నారు. నవంబర్ 26న మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని ఈ విషయాన్ని చెప్పారు.

We’re now on WhatsApp : Click to Join

రకుల్, జాకీ పెళ్లి ఎప్పుడు?

రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నాని ప్రస్తుతం తమ పెళ్లికి సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ఈ జంట గొప్ప వివాహ వేడుకను నిర్వహించవచ్చు. ఈ జంట‌ పెళ్లి తేదీని పరిశీలిస్తే 21 ఫిబ్రవరి 2024న‌ రకుల్- జాకీ వివాహం చేసుకోనున్నారు.

  Last Updated: 03 Feb 2024, 07:35 AM IST