Radha Krishna: ఆ దర్శకుడి విషయంలో మళ్లీ తప్పు చేస్తున్న ప్రభాస్.. ఆందోళనలో అభిమానులు?

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 01:15 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ రాధాకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో పలు సినిమాలకు రచయితగా పనిచేసిన రాధాకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో దర్శకుడిగా మారారు. సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఇందులో గోపీచంద్ ని మాత్రం చాలా స్టైలిష్ గా చూపించారు రాధాకృష్ణ. దీంతో ప్రభాస్ రాధాకృష్ణకు అవకాశం ఇవ్వడంతో రాధేశ్యామ్ సినిమాని తీసాడు. ప్రభాస్ అభిమానులు టైటానిక్ రేంజ్ లవ్ స్టోరీ అంటూ ఆశపడి వెళ్తే రాధేశ్యామ్ సినిమాతో రాధాకృష్ణ నిరాశపరిచాడు.

కొన్ని సాంగ్స్, విజువల్స్ తప్ప సినిమా పరంగా అంతగా ఎవ్వరికి నచ్చలేదు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే రాధేశ్యామ్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికి డైరెక్టర్ రాధాకృష్ణ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం రాధాకృష్ణకు ప్రభాస్ మళ్ళీ అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ సారి నిర్మాతగా అవకాశం ఇచ్చాడు ప్రభాస్. తన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో డైరెక్టర్ రాధాకృష్ణకు గోపీచంద్ తో సినిమా ఓకే చేసారని టాలీవుడ్ సమాచారం.

గతంలో గోపీచంద్ తో జిల్ సినిమా తీసిన రాధాకృష్ణ ఇప్పుడు మరోసారి గోపీచంద్ తో సినిమా తీయబోతున్నాడట. మరి ఈ సారి ఏ కాన్సెప్టుతో వస్తాడో, ఈ సారైనా హిట్ కొడతాడా లేదో చూడాలి మరి. అయితే ప్రభాస్, రాధాకృష్ణకు నిర్మాతగా కాదు డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు అంటూ కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.