Exclusive: ‘పవన్ – త్రివిక్రమ్’ కాంబోలో మరో మూవీ.. ఫ్యాన్స్ కు పండగే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ అలాంటిది మరి.

  • Written By:
  • Updated On - March 10, 2022 / 03:19 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ బేస్ అలాంటిది మరి. ఆ అభిమానానికి త్రివిక్రమ్ దర్శకత్వం తోడైతే .. ఇక వచ్చే ఆ కిక్కే వేరప్పా. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరప్పా అని పవన్ కళ్యాణ్ తో ఈ డైలాగ్ చెప్పించారు ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్. మరోసారి పవన్ ఫ్యాన్స్ కు విందు భోజనం లాంటి సినిమా ఇచ్చేందుకు త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగానే ‘త్రివిక్రమ్ – పవన్’ కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వీరి కలయికలో ఇప్పటికే ‘జల్సా’ , ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు రాగా.. మొదటి రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ‘అజ్ఞాతవాసి’ మాత్రం డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందనేది లేటెస్ట్ న్యూస్. మాంచి కామెడీ ట్రాక్ తో ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారని… యాక్షన్ పార్ట్ కూడా అదిరిపోయేలా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్.. పవన్ కు నచ్చడంతో.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. పవన్ సొంత బ్యానర్ తో పాటు, హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఈ సినిమా రానుందని సమాచారం.

ఇకపోతే, ఇటీవల వచ్చిన పవన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘భీమ్లా నాయక్’ కు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అలానే ఈ చిత్రంలో ఒక పాట కూడా రాశారు త్రివిక్రమ్. దానికి కారణం పవన్, త్రివిక్రమ్ ల మధ్య ఉన్న స్నేహమే. ముందునుంచి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండడం.. దానికి తోడు మళ్లీ వీరి కలయికలో నాలుగో సినిమా రానుండడంతో.. అంచనాలు భారీగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. అలానే పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని ఫిల్మ్ నగర్ టాక్. మరోవైపు
ఈ నెల 18 నుంచి పవన్ ‘హరిహర వీరమల్లు’ తాజా షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నారు. క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఆ తరువాత హరీశ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను… అనంతరం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాను చేయనున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. ఆ తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తాజా సమాచారం. చూడాలి మరి ‘పవన్ – త్రివిక్రమ్’ కాంబోలో నాలుగో సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టించనుందో అనేది.