హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన ‘పఠాన్’ (Pathan) చిత్రం ఆయన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని సృష్టిస్తున్నది. కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 950 కోట్ల వసూళ్లను సాధించింది. వెయ్యి కోట్ల మార్కు అందుకునేందుకు చేరువైంది. రెండు వారాలు పూర్తయినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఆదివారం కూడా ఈ చిత్రం రూ. 12.50 కోట్లు రాబట్టింది.
భారత్తో పాటు విదేశాల్లోనూ ‘పఠాన్’ (Pathan) జోరు కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ చేరనుంది. బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ఖాన్ గూఢచారిగా నటించారు. దీపికా పదుకొన్, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషించారు.
Also Read: Diabetes: భారత్లో 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!