Viral : చిరంజీవికి సారీ చెప్పిన ఎన్టీఆర్..

పెద్ద హీరో అంటే మా తాతగారు ఎన్టీ రామారావు గారు మాత్రమే అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 03:00 PM IST

టాలీవుడ్ (Tollywood) లో అగ్ర హీరో ఎవరంటే ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేరే చెపుతుంటారు. ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్స్ ఉన్నప్పటికీ..సినీ ప్రేక్షకులు, ప్రముఖులు మాత్రం టాలీవుడ్ లో నెం 1 హీరో ఎవరంటే మాత్రం చిరంజీవి అనే చెపుతారు. ఇది ఈరోజు మాట కాదు సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుండి ఇండస్ట్రీ పేరును నిలబెడుతూ వస్తున్నది చిరంజీవి మాత్రమే. అంతెందుకు టాలీవుడ్ రూపు రేఖలు మార్చింది..టాలీవుడ్ కు సరికొత్త ఇమేజ్ ను..బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ని తీసుకొచ్చింది..ఇలా ఎన్నో చేసింది చిరంజీవే. అందుకే అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికి చిరంజీవే అగ్ర హీరో అంటారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు సైతం చిరంజీవే మా గురువు అంటారు. అలాంటి గురువుకు ఎన్టీఆర్ (NTR) సారీ చెప్పాల్సి వచ్చింది. కాకపోతే ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో జరిగింది..కాకపోతే ఇప్పుడు వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్టీఆర్ – రాజమౌళి కలయికలో వచ్చిన సింహాంద్రి మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా టాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే కాదు ఎన్టీఆర్ ను మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది కూడా..ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది. అయితే ఈ సినిమా విజయం తర్వాత ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ చేసాడు. ఆ ఇంటర్వ్యూ లో హోస్ట్ అడిగిన ప్రశ్నకి ఎన్టీఆర్ ఇచ్చిన ఆన్సర్ సినీ జనాలకు నచ్చలేదు. ” పెద్ద హీరో అంటే మా తాతగారు ఎన్టీ రామారావు గారు మాత్రమే అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు”. కొంతమంది ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని.. ఎన్టీఆర్ పై ట్రోలింగ్ చేశారు . అంతేకాదు ఆ ఇంటర్వ్యూ చూసిన నాగార్జున సైతం ఎన్టీఆర్ కు కాల్ చేసి మరి చిరంజీవికి సారీ చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చారట. తప్పు అలా మాట్లాడకూడదు .. ఇండస్ట్రీలో పెద్దవాళ్లు .. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలిసి తెలియక నువ్వు మాట్లాడిన మాటలు నీ కెరీర్ ని డౌన్ ఫాల్ చేస్తాయి.. ముందు చిరంజీవికి కాల్ చేసే సారీ చెప్పు అంటూ చెప్పుకొచ్చారట. నాగార్జున చెప్పగానే ఎన్టీఆర్ – చిరంజీవికి కాల్ చేసి సారీ చెప్పారట. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇండస్ట్రీ లో సీనియర్ హీరోల్లో నాగార్జున, బాలకృష్ణ , వెంకటేష్ , చిరంజీవి. వీరంతా కూడా ఇప్పటికి చిరంజీవిని గౌరవిస్తూ..ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ..తరుచు కలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వీరు గొడవలు పడిన సందర్భాలు లేవు..వీరంతా కూడా అప్పుడు..ఇప్పుడు చిరంజీవే నెం 1 హీరో అంటుంటారు. అందుకే అప్పుడు నాగ్..ఎన్టీఆర్ కు కాల్ చేసి ఆలా చెప్పినట్లు ఉంది.

Read Also : Radhika Khera: మద్యం ఇచ్చి అనుచితంగా ప్రవర్తించారు అంటూ రాధికా సంచలనం