Toxic : రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్’ సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. కేజీఎఫ్ 2 రిలీజైన దాదాపు ఏడాదిన్నర తరువాత ‘టాక్సిక్’ అనే మూవీని అనౌన్స్ చేసారు. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. ఇక ఈ సినిమాలో యశ్ పక్క ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కనిపించబోతున్నారని ఇప్పటికే వార్తలు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.
యశ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుంటే.. యశ్ కి అక్క పాత్రలో కాజోల్ కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాజోల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. కాజోల్ స్థానంలోకి సౌత్ లేడీ మెగాస్టార్ నయనతార ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. యశ్ కి అక్కగా నయనతార కనిపించబోతుందట. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు. కాగా నయనతార గతంలో చిరంజీవికి సిస్టర్ గా ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కనిపించారు. ఇప్పుడు యశ్ కి సిస్టర్ గా కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గ్యాంబ్లింగ్ అండ్ హీస్ట్ నేపథ్యంతో ఉండబోతుందని తెలుస్తుంది. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు కూడా నిర్మాతలు ప్రకటించేసారు. మరి కేజీఎఫ్ తో భారీ స్టార్డమ్ ని సంపాదించుకున్న యశ్.. ఈ సినిమాతో తన ఆడియన్స్ ని సంతృప్తి పరుస్తాడో లేదో చూడాలి.
ఇది ఇలా ఉంటే, యశ్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణంలో కూడా నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తుంటే యశ్ రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నారట. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలయింది.
Also read : Nagarjuna : టీడీపీ, వైసీపీ పార్టీలపై నాగార్జున కామెంట్స్.. నెట్టింట వైరల్ అవుతున్నవి నిజమేనా..?