దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల కార్యక్రమం (Padma Awards Event) సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా, రాజకీయంగా హిందూపురం ఎమ్మెల్యేగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరై తన ప్రత్యేకతను చాటారు.
Metro : మెట్రోలో చేయకూడని పని చేసిన మహిళ..అధికారులు సీరియస్
బాలకృష్ణ పంచెకట్టు ధరించి, మెడలో కండువా వేసుకొని పద్మభూషణ్(Padma Bhushan) అవార్డు స్వీకరించడం తెలుగు ప్రజల గర్వానికి కారకమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం స్వీకరించిన బాలయ్య, తన సాంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పద్మ అవార్డుల కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. అలాగే తమిళ సినిమా నటుడు అజిత్ కుమార్ కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ వేడుకతో మరోసారి తెలుగు తమ్ముళ్ల ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా వినిపింపజేయడంలో బాలకృష్ణ ముఖ్యపాత్ర పోషించాడు.
President Droupadi Murmu presents Padma Bhushan in the field of Art to Shri Nandamuri Balakrishna. He is a popular actor in the Telugu Cinema. During a career spanning over five decades, he acted in films of various genres and enacted memorable roles. He is also recognised for… pic.twitter.com/9ACBGQfOTj
— President of India (@rashtrapatibhvn) April 28, 2025