Nagarjuna To Take Break: ‘ది ఘోస్ట్’ విడుదలయ్యాక.. 3 నెలలు నాగ్ రెస్ట్.. 2023లోనే యాక్షన్ లోకి!!

దసరా పండుగ సమీపించింది. ఈ ఫెస్టివల్ వేళ కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 06:45 AM IST

దసరా పండుగ సమీపించింది. ఈ ఫెస్టివల్ వేళ కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
దీనికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..

అక్కినేని నాగార్జున ఈ ఏజ్‌లో కూడా వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. ఈ యేడాది ‘బంగార్రాజు’ మూవీలో తన తనయుడు నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకొని సూపర్ హిట్ అందుకున్నారు. రీసెంట్‌గా ఈయన బ్రహ్మాస్త్ర’ సినిమాతో పలకరించారు. ఇపుడు ‘ది ఘోస్ట్’ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాను హిందీలో విడుదల చేయలనుకుంటున్నారు. ఇటీవల
కర్నూల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన అఖిల్, నాగ చైతన్య తన నాన్న నాగార్జున పాల్గొని ప్రమోట్ చేశారు.

గత రెండేళ్లుగా రెస్ట్ లేదు

అయితే ‘ది ఘోస్ట్’కు ముందుకు
“బ్రహ్మాస్త్ర” లాంటి భారీ పాన్ ఇండియా మూవీలో నటించాడు నాగార్జున. ఈ మూవీ వసూళ్ల తీరుపై ఆనందం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా వరుస సినిమాలతో నాగార్జున గ్యాప్ లెస్ గా శ్రమించారు.‘ది ఘోస్ట్’ రిలీజ్ అయిన తర్వాత 3 నెలల పాటు నాగ్ విశ్రాంతి తీసుకోనున్నారని సమాచారం. బంగార్రాజు- బిగ్ బాస్ నాన్ స్టాప్- ద ఘోస్ట్- బ్రహ్మాస్త్ర- ‘బిగ్ బాస్ తెలుగు 6’ ఈ 24 నెలల్లో ఆయన చేపట్టిన పెద్ద ప్రాజెక్ట్ లు. ఇవన్నీ భారీగా శారీరక శ్రమతో పాటు మానసికంగా అలసిపోయేంత పెద్ద ప్రాజెక్టులు. ”పని నుండి నాకు కొంత విశ్రాంతి కావాలి. వచ్చే మూడు నెలల వరకు సినిమాల గురించి ఆలోచించను” అని నాగార్జున ఇటీవల ఒక సందర్భంలో అన్నారు. నాగార్జున 2023లో మాత్రమే కొత్త సినిమాలు చేయాలను కుంటున్నారు.

బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో నటిస్తారా ? లేదా?

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్ర మూవీలో నాగార్జున అక్కినేని నందియాస్త్ర పాత్రలో కనిపించారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో నటిస్తారా ? లేదా? అనే దానిపైనా ఓపెనయ్యారు. పార్ట్ 2 లో కనిపిస్తానా? లేదా ?అనే దాని గురించి తాను ఏమీ చెప్పే స్థితిలో లేనని అన్నారు. అయితే సీక్వెల్ లో మంచి పాత్రలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు నాగార్జున పేర్కొన్నారు. 19 ఏళ్ల విరామం తర్వాత నాగార్జున హిందీ సినిమాల్లోకి తిరిగి ప్రవేశించారు. బ్రహ్మాస్త్రతో ఇది సాధ్యమైంది.