Chaitanya : సమంతతో బ్రేకప్ తర్వాత చైతూ ఫస్ట్ పోస్ట్.. ‘జీవితానికి ప్రేమలేఖ’ అంటూ!

సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య తన మొదటి పోస్ట్ ను ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చైతూ ఇటీవల చదివిన ఒక పుస్తకం ఫోటోను షేర్ చేశాడు. తాను చాలా సైలెంట్ పర్సన్ అని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం

  • Written By:
  • Updated On - November 20, 2021 / 05:16 PM IST

సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య తన మొదటి పోస్ట్ ను ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చైతూ ఇటీవల చదివిన ఒక పుస్తకం ఫోటోను షేర్ చేశాడు. తాను చాలా సైలెంట్ పర్సన్ అని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం తనకు ఇష్టం లేదని పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇప్పటి వరకు చైతూ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కేవలం 52 ఫోటోలను మాత్రమే పోస్ట్ చేశాడు. అక్టోబ‌ర్ 2న స‌మంత, నాగ చైత‌న్య విభేదాల‌తో విడిపోయామ‌ని ప్రకటించారు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ స్టేట్ మెంట్ తర్వాత చైతూ దాదాపు నెల వరకు ఇన్ స్టాకు దూరమయ్యాడు.

శనివారం తాను ఇటీవల చదివిన పుస్తకం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. మాథ్యూ మెక్‌కోనాఘే ద్వారా గ్రీన్‌లైట్ పుస్తకాన్ని చదవడం బాగా ఎంజాయ్ చేశాడు. దానికి సంబందించిన ఫోటోను షేర్ చేస్తూ, “జీవితానికి ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు @officiallymcconaughey ధన్యవాదాలు.. ఈ పఠనం నాకు గ్రీన్ లైట్.. గౌరవం సార్” అని రాశాడు. తమ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు, సమంత, చైతూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక బంధం కొనసాగించారు. 2017లో గోవాలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.