కథానాయకుడు అక్కినేని నాగచైతన్య మనం లాంటి బ్లాక్బస్టర్ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్రాజు, శిరీష్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. టీజర్తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో..నీతో నేనెంటో.. చూసే చూపేంటో..మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో అంటూ కొనసాగే మ్యాజికల్ మెలోడి లిరికల్ వీడియోను గురువారం విడుదల చేసింది చిత్రబృందం.బ్యూటిఫుల్ మెలోడి సాంగ్గా అందర్ని ఆకట్టుకుంటున్న ఈ పాటకు ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, జోనిత గాంధీ ఆలపించారు. సక్సెస్ఫుల్ సంగీత దర్శకుడు తమన్ స్వరాలను అందించారు. లెజండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు.
One of my favorite #EntoEnteynto from the album ! #ThankYouTheMovie https://t.co/t1999ftFRs@MusicThaman@IananthaSriram@jonitamusic
#MalavikaNair @RaashiiKhanna_ @Vikram_K_Kumar @pcsreeram @BvsRavi @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/rXCbsbVvSe— chaitanya akkineni (@chay_akkineni) June 16, 2022