మెగా అభిమానులకు ఇది నిజంగానే బంపర్ కిక్ ఇచ్చే న్యూస్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్చరణ్ దాదాపు 20 నిమిషాల పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. ఇక మూవీ రిలీజ్కి సంబంధించి కూడా ప్రొడ్యూసర్ అన్వేష్ రెడ్డి అన్నీ ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వకపోయినప్పటికీ ప్రీరిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్గా చేయాలని చూస్తున్నాడట.
మూవీ రిలీజ్కి రెండు వారాల ముందే ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండబోతోంది. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో మొత్తం కలిపి 1500 నుంచి 2వేల స్క్రీన్లలో ఆచార్య రిలీజ్ కాబోతోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా మినిమం స్క్రీన్లలో రిలీజవుతుంది. ప్రస్తుతానికి పాన్ ఇండియా రిలీజ్కు ఏమీ ప్లాన్స్ లేవని, తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత హిందీ, ఇతర భాషల్లో డబ్బింగ్కు ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత అన్వేష్ చెబుతున్నాడు. చిరంజీవితో పాటు రాంచరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.