టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం “సర్కారు వారి పాట”. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేయగా, కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల పోస్ట్ పోన్ అవగా, తాజాగా సమ్మర్కు ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.ఇక మరోవైపు ఇప్పటి మహేష్ తన తర్వాతి చిత్రం భారీగా ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన తర్వాత చిత్రం చేయనున్నాడనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుటికే ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేశారని, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, మహేష్ గత మూవీస్కి భిన్నంగా, అడ్వెంచర్లు ఎక్కువగా ఉండబోతున్నాయని సమాచారం.
అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. మహేష్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్బాబు ఇప్పటికే అతడు, ఖలేజ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతుంది. ఖలేజ అంతగా సక్సెస్ కాకపోవడంతో, ఈసారి భారీ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని సమాచారం.
ఇప్పటికే కథా చర్చలు పూర్తవగా త్రివిక్రమ్ చెప్పిన లైనప్ నచ్చడంతో మహేష్ వెంటనే ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పూజా కార్యక్రమం కూడా జరిగిపోవడం, చకచకా జరిగిపోయాయి. హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్లో అట్టహాసంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ సతీమణి నమ్రత, బుట్టబొమ్మ పూజా హెగ్డే, నిర్మాత సూర్యదేవర నాగవంశీలు హాజరు అయ్యారు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.