Mahesh Babu: రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసేందుకు మహేశ్ బాబు బిగ్ ప్లాన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Maheshbabu

Maheshbabu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళితో సినిమాలు చేసే హీరోలకు రాజమౌళి సినిమా హిట్ అయినా, తదుపరి సినిమా ఫ్లాప్. అయితే రాజమౌళి సినిమా తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవ్వకుండా ఉండేందుకు మహేష్ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు క్రేజ్ మామూలుగా లేదు. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గుంటూరు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. రాజమౌళి కూడా ఆయన చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే మహేష్ బాబు తదుపరి సినిమా అప్‌డేట్ వచ్చింది. నెట్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది.

  Last Updated: 04 Nov 2023, 05:06 PM IST