Mahesh: సితార బాండింగ్ పై మహేష్ కామెంట్స్.. జూనియర్ జెలస్!

సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా పాల్గొన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్ ఎట్టకేలకు విడుదలైంది. మహేష్ బాబు కూల్ గా, సరదాగా కనిపించి ఎన్టీఆర్ షోలో ఆకట్టుకున్నాడు.

  • Written By:
  • Updated On - December 7, 2021 / 01:50 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా పాల్గొన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్ ఎట్టకేలకు విడుదలైంది. మహేష్ బాబు కూల్ గా, సరదాగా కనిపించి ఎన్టీఆర్ షోలో ఆకట్టుకున్నాడు. ప్రదర్శన కొనసాగుతున్నప్పుడు ఇద్దరూ తమ సినిమాలు, మ్యూజిక్, వర్క్.. ఇలా చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. అయితే మహేష్ బాబు తన గారాలపట్టి సితార గురించి మాట్లాడటం ప్రతిఒక్కరినీ ఆకర్షించింది.

జూనియర్ ఎన్టీఆర్ సితార గురించి మహేష్‌ని అడగడంతో ” పిల్లల పుట్టినప్పటినుంచీ పెరిగి పెద్దవుతున్న క్రమంలో మనం చూపించే ప్రేమలు, బంధాలు కూడా మారుతుంటాయి. 1-3 సంవత్సరాల నుంచి భిన్నమైన బంధం ఉంటుందని, ఆపై 3-5 నుంచి, మరో రకంగా ఉంటుంది. సంవత్సరం, సంబంధం మారుతూ ఉంటుంది. ప్రతిసారీ తండ్రికి అప్‌గ్రేడేషన్ అవసరం.” అని సమాధానం ఇవ్వగా.. దీనికి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘ఆడపిల్లలు ఉన్నవాళ్లంటే నాకు ఈర్ష్యగా అనిపిస్తుంది. వెంటనే మహేష్, “మీకు ఓక పాప కావాలి” అని చెప్పడంతో సెట్‌లో ఉన్నవారంతా పగలబడి నవ్వారు. “తండ్రి కావడం నిజంగా ప్రత్యేకం. అది ఆడపిల్ల అయినా, అబ్బాయి అయినా” అని జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినప్పటికీ, అతను ఎప్పుడూ కుమార్తెను కలిగి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

అడివి శేష్ నటించిన మేజర్ చిత్రం గురించి కూడా మహేష్ బాబు మాట్లాడుతూ, “శేష్ అద్భుతంగా చేశాడు. అతనికి హ్యాట్సాఫ్. నేను చూసిన రష్‌లు ఏమైనప్పటికీ, శేష్‌ని చూసి గర్వపడుతున్నాను. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌తో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎండ్ అవుతుంది. ఇంతకుముందు, రామ్ చరణ్, సమంతా రూత్ ప్రభు, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ తదితరులు ప్రముఖ గేమ్ షోకి అటెండ్ అయ్యారు.