మలయాళంలో ఘనవిజయం సాధించిన పోరింజు మరియన్ జోస్ సినిమా రీమేక్ పై కింగ్ నాగార్జున దృష్టి సారించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ రేసులో ఉన్నారు. షూటింగ్ లాంఛనాలు సెప్టెంబర్లో ప్రారంభమవుతాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్గా బౌండ్ స్క్రిప్ట్కి నాగ్ ఆమోదం తెలిపాడు. అప్డేట్ ప్రకారం, నిర్మాతలు కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా పరిశీలిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ను ఖరారు చేయలేదు.
తెలుగు సినిమా సీనియర్ నటుల పక్కన హీరోయిన్ల కొరత చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ ను సెలెక్ట్ చేయాలని భావిస్తున్నారట. శ్రీనివాస చిట్టూరి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. నాగార్జున మరో రెండు ప్రాజెక్ట్ల కోసం చర్చలు జరుపుతున్నాడు. అవి సరైన సమయంలో ప్రకటించబడతాయి.
సినిమాల ఎంపికలో వేగం తగ్గించిన నాగ్ రియాల్టీ షో తో మాత్రం ఎంటర్ టైన్ చేస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ స్పష్టం చేస్తున్నారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. అంతా ఉల్టా పుల్టా అంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. ఈ మేరకు స్టార్ మా చానల్ బిగ్ బాస్-7 తాజా ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో చిన్న స్కిట్ ను కూడా ప్రదర్శించారు. అయితే బిగ బాస్ హోస్ట్ చేయడం కోసం నాగార్జున భారీగా పారితోషికం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
Also Read: TSRTC Gamyam: ఒక్క క్లిక్ తో బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు!