టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో ఉందో మా అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అంటే పడి చచ్చే అభిమానులు ఉన్నారు. ఇక తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అన్ని భాషల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఆనందంగా ప్రేమిస్తూ ఉంటాడు.
అభిమానులకు చిన్న కష్టం వచ్చింది అంటే చాలు వెంటనే స్పందిస్తూ అందుకు తగిన ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కోమాలో ఉన్న తన అభిమాని జనార్ధన్ తల్లితో ఫోన్ మాట్లాడారు. అదే పడకుండా దేవుడిని నమ్మండని జనార్దన్ తల్లికి ధైర్యం చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా తన మాటలతో జనార్ధన్ కోలుకుంటాడు అన్న భరోసాను ఇచ్చాడు. జనార్దన్ తల్లి తో మాట్లాడిన తర్వాత జనార్ధన్ చెవి దగ్గర ఫోన్ పెట్టగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..
Upon hearing that his fan, Janardhan’s health is in critical condition, @tarak9999
reached out to Janardhan’s mother. NTR also spoke to Janardhan through speaker phone and wished him a speedy recovery.#JrNTR pic.twitter.com/Tk6pGYogBr— Sreedhar Marati (@SreedharSri4u) June 29, 2022
నేను ఎన్టీఆర్ను మాట్లాడుతున్నాను, నువ్వు త్వరగా కోలుకుంటే మనము కలుద్దాం.. మేము అందరం నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము..నిన్ను చూడాలని ఉంది..త్వరగా కోలుకుని వచ్చేయ్, నీకోసం ప్రార్థిస్తున్నాము..నీకోసం నేనున్నాను, మన అభిమానులున్నారు. అందరూ నీ మంచి కోరుకుంటారు. నువ్వు త్వరగా కోలుకుని వచ్చేసేయ్, కలుద్దాం. నీకేం అవదు అని మాట్లాడుతూ జనార్దన్ కి కొండంత భరోసా ఇచ్చాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతుంటే కోమాలో ఉన్న జనార్ధన్ వేళ్లు కదిలిస్తున్నాడని అక్కడున్నవాళ్లు తెలిపరు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.