Janhvi To Act: మైత్రి కుదిరింది.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది!

జాన్వీ కపూర్‌ని తెలుగు తెరపైకి తీసుకురావడానికి టాలీవుడ్ లో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆమె ఇప్పటికే తెలుగులో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి.

  • Written By:
  • Updated On - January 27, 2022 / 02:31 PM IST

జాన్వీ కపూర్‌ని తెలుగు తెరపైకి తీసుకురావడానికి టాలీవుడ్ లో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆమె ఇప్పటికే తెలుగులో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆమె పూరీ జగన్నాథ్ ‘జనగణ మన’తో తెరంగేట్రం చేస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన కూడా ఆమెను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ బ్యానర్ వారు ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కోసం ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఎన్టీఆర్‌కి కథ వినిపించి ఆ ప్రాజెక్ట్ ను లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు జాన్వీ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడు. ఈ సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ కూడా తీసుకురావాలనేది ఆలోచన. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా జాన్వీ కపూర్.. తనదైన ముద్ర వేస్తోంది. ఒకవైపు గ్లామర్ చిత్రాల్లో నటిస్తూనే. మరోవైపు కథాబలం ఉన్న సినిమాల్లో జాన్వీ నటిస్తోంది. ఈ బ్యూటీని టాలీవుడ్ లోకి తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఒక్కటీ సక్సెస్ కాలేదు. గతంలో రామ్ చరణ్, అఖిల్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ తో సినిమాలు చేయనుందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాతోనైనా జాన్వీ టాలీవుడ్ లో అడుగుపెడుతుందా? అనేది వేచిచూడాల్సిందే!