బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల వేంకటేశ్వర స్వామిని ఓ సెంటిమెంట్ గా భావిస్తుంది. అందుకే ఈబ్యూటీకి ఏమాత్రం సమయం దొరికినా శ్రీవారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతుంది. గురువారం జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆధ్యాత్మిక సేవలో గడిపింది. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి కాలినడకన తిరుమల చేరుకుంది.
ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎప్పుడూ పొట్టి దుస్తుల్లో కనిపించే ఈ బాలీవుడ్ బ్యూటీ లంగా ఓణీలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. జాన్వీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. తన తల్లి శ్రీదేవి జయంతి, వర్ధంతి రోజున జాన్వీ తిరుమలను దర్శించుకుంటున్న విషయం తెలిసిందే.