Mahesh Babu: ఫ్యామిలీతో టూర్లకెళ్లడం తప్పా.. ట్రోల్స్ పై మహేశ్ రియాక్షన్

నేను మా కుటుంబంతో సెలవులకు వెళితే మీకు ఎందుకు జెలస్?" అని మహేశ్ అన్నారు.

  • Written By:
  • Updated On - August 21, 2023 / 12:08 PM IST

సమయం దొరికినప్పుడు మహేష్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటాడు. అయితే మహేశ్ రెగ్యులర్ వెకేషన్, ఫ్యామిలీ టూర్లకెళ్లడం పట్ల విమర్శలు వెలువడిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్నంత సమయం మహేష్ సినిమా కోసం వెచ్చిస్తే ఈపాటికి ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తయ్యేదని మహేష్‌పై విమర్శలు గుప్పించేవారు ఉన్నారు. ఈ విషయంపై నేరుగా మహేష్ బాబు రియాక్ట్ అయ్యాడు.

“నేను మా కుటుంబంతో సెలవులకు వెళితే మీకు ఎందుకు జెలస్?” అని గట్టిగా సమాధానమిచ్చారు. “నేను రెగ్యులర్‌గా సెలవులు తీసుకుంటాను, ప్రతి ఒక్కరూ చూడగలిగేలా వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా పంచుకుంటాను. షూటింగ్‌లో విరామం దొరికినప్పుడల్లా లేదా నా పిల్లలకు పాఠశాలకు సెలవు దొరికినప్పుడల్లా, మేము కలిసి చిన్న ప్రయాణాలు చేస్తాము. నేను సెలవులకు వెళ్లాలని నిర్ణయించుకుంటే ఇతరులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్ధం కావడం లేదు” అని మహేష్ చెప్పాడు.

మహేష్ తన విహారయాత్రకు సంబంధించి సూటిగా, స్పష్టంగా స్పందించాడు. భవిష్యత్తులో కూడా తనకు విరామం దొరికినప్పుడల్లా యాత్రలు చేస్తూనే ఉంటానని, ముఖ్యంగా తన పిల్లలకు పాఠశాలకు సెలవు దొరికినప్పుడల్లా విహారయాత్రలకు వెళ్తానని ఉద్ఘాటించారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటంతో విడుదల తేదీపై ఆందోళన నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా “గుంటూరుకారం” విడుదల చేయనున్నట్టు ప్రకటించి ఈ సందేహాలకు క్లారిటీ ఇచ్చాడు మహేష్.

Also Read: MLC Kavitha: సామాజిక సేవలో ఎమ్మెల్సీ కవిత కుమారులు