Krishna Vamsy : సీక్వెల్స్ నచ్చవు.. కృష్ణవంశీ ఇలా అనేశాడేంటి..?

ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ సినిమా గురించి డౌట్లను క్లియర్ చేస్తున్నారు కృష్ణవంశీ. ఇదే క్రమంలో కృష్ణవంశీకి సంబందించిన వేరే సినిమాల గురించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 03:31 PM IST

స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsy) కెరీర్ లో వెనకపడిపోయారు. ఒకప్పటు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన ఈమధ్య తన మార్క్ చూపించలేకపోతున్నారు. చివరగా రంగమార్తాండ సినిమా చేసిన కృష్ణవంశీ సూపర్ స్టార్ మహేష్ మురారి రీ రిలీజ్ టైం లో సోషల్ మీడియలో సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. మురారి సినిమా (Murari Movie) సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఐతే ఈ సందర్భంగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ సినిమా గురించి డౌట్లను క్లియర్ చేస్తున్నారు కృష్ణవంశీ. ఇదే క్రమంలో కృష్ణవంశీకి సంబందించిన వేరే సినిమాల గురించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన డైరెక్షన్ లో వచ్చిన చందమామ (Chandamama) సినిమాను సీక్వెల్ చేస్తారా అని ఒక నెటిజన్ అడిగాడు. ఐతే తను సీక్వెల్ చేసే ఆలోచన లేదని.. అసలు సీక్వెల్స్ ఎందుకు చేస్తారో అర్ధం కాదు అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చారు కృష్ణవంశీ.

అసలు ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న సీక్వెల్స్ పై కృష్ణవంశీ అలాంటి మాట అనడం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ఐతే డైరెక్టర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఒక సినిమా కథ ఒకే భాగంలో చెప్పాలన్నది కృష్ణవంశీ ఆలోచన. అందుకే అసలు సినిమాను భాగాలుగా ఎలా చేస్తారో అని డౌట్ వ్యక్తపరిచారు కృష్ణవంశీ.

ఐతే దాదాపు ఇప్పుడు మన స్టార్స్ అంతా ఇలానే తమ సినిమాలను రెండు భాగాలుగా చేస్తుంటే కృష్ణవంశీ ఇలా డౌట్ రేంజ్ చేయడం ఇది వారి మీద ఆయన చూపిస్తున్న అసంతృప్తిలా కూడా చెప్పుకోవచ్చు. ఆయన చేసింది ఏ ఉద్దేశంతో అయినా కృష్ణవంశీ చేసిన సీక్వెల్స్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Rajamouli : రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ తీస్తున్న డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ చూశారా?

Follow us