NTR : దేవర షూటింగ్ యూనిట్ ఫై తేనెటీగల దాడి..

ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం డ్రోన్ ఎగరవేయగా.. ఆ శబ్దానికి తేనెటీగలు ఎగిరి అక్కడ ఉన్న వారిపై దాడి చేసాయి

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 08:47 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) – కొరటాల శివ (Koratala Shiva) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). ఈ మూవీ ఫై అభిమానుల్లో చిత్రసీమలో ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆచార్య ప్లాప్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొరటాల ఈ చిత్రాన్ని తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా పలు విషయాలు సినిమా ఫై ఆసక్తి పెంచగా..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద జరుగుతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఫై తేనెటీగలు దాడి చేశాయి. ఫైట్ సీన్ చిత్రీకరణ కోసం డ్రోన్ ఎగరవేయగా.. ఆ శబ్దానికి తేనెటీగలు ఎగిరి అక్కడ ఉన్న వారిపై దాడి చేసాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడి లో దాదాపు 20 మంది జూనియర్ ఆర్టిస్ట్ లకు గాయాలు అయ్యాయి. వీరిని వెంటనే అక్కడ ఉన్న హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎన్టీఆర్ లేరు. ప్రస్తుతం అయన వార్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janvi kapoor), మ‌రాఠీ భామ శృతి మరాటే హీరోయిన్లుగా నటిస్తుండగా.సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా నటిస్తున్నాడు. మ‌ల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Read Also : T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే