Suicide Letter To Director Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సూసైడ్ నోట్

  • Written By:
  • Publish Date - December 9, 2022 / 09:06 AM IST

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం ఫిల్మ్ మేకర్ హరీష్ శంకర్‌(director Harish Shankar)తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద అప్‌డేట్ ఉందని దర్శకుడు (director Harish Shankar) ఇటీవల సూచించాడు. ఈ సినిమా థెరికి రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెరపైకి రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ థెరి రీమేక్‌లో కాకుండా కొత్త కథతో కూడిన సినిమాలో నటించాలని అభిమానులు అంటున్నారు. దీనిపై పలువురు అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. థేరి ఒక యాక్షన్-థ్రిల్లర్.. ఇది 2016లో సినిమా హాళ్లలో విడుదలైంది. ఇది భారీ కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఇందులో తలపతి విజయ్‌ ప్రధాన పాత్ర పోషించారు.

తేరి తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడనే వార్తలపై పవన్ కళ్యాణ్ జాబ్రా అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రీమేక్‌లకు దూరంగా ఉన్న నటుడు ఒరిజినల్ సినిమాలు చేయాలని అభిమానులు భావిస్తున్నారు. వారిలో ఒకరు హరీష్ శంకర్ కు సూసైడ్ లెటర్ రాసి ఈ రీమేక్‌ను వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని దర్శకుడు హరీష్ శంకర్‌, మైత్రీ మూవీ మేకర్స్‌కి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: BJP : పుష్ప అంటే ఫ్లవర్‌ కాదు పవర్‌

ఆ లేఖలో ఏముందంటే.. సర్ ఇంత వరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ లెటర్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు ఎన్ని రీమేక్స్ తీసినా ఎప్పుడూ ఇంత ఫీలవ్వలేదు. కానీ తేరి రీమేక్ అని తెలిశాక రాయక తప్పలేదు. కనీసం నా చావుని చూసైనా తేరి రీమేక్‌ని క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నా. ఆల్‌రెడీ ప్రతి ఆదివారం టైమింగ్స్ మార్చి టీవీల్లో తేరి మూవీని వేస్తున్నారు. ప్లీజ్ సార్.. ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేయండి. నా చావుకి కారణం మైత్రీ మూవీ మేకర్స్ టీమ్, డైరెక్టర్ హరీష్ శంకర్. చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోకండి అని రాసి ఉంది.

పవన్ కళ్యాణ్‌కి రీమేక్‌లు కొత్తేమీ కాదు. ఆయన చివరిగా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ భీమ్లా నాయక్‌లో కనిపించారు. పవన్ కళ్యాణ్ రాబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే.. హరి హర వీరమల్లులో పనిచేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. హరి హర వీర మల్లు మార్చి 30, 2023న థియేటర్లలో విడుదల కానుంది. సాహో ఫేం సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నటించనున్నాడు.